వైఎస్ జగన్ రెడ్డి ఒక పిచ్చి తుగ్లక్ : నిమ్మ‌ల

మావిగ‌న్ అంటే జ‌నం జ‌డుసుకుంటున్నారు

అమ‌రావ‌తి : మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ రెడ్డి ఒక పిచ్చి తుగ్ల‌క్ అని ఫైర్ అయ్యారు. జగన్ మావిగన్ అంటే కూటమి భయపడటం లేద‌న్నారు. ప్రజలే జంకుతున్నార‌ని పేర్కొన్నారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తాడ‌ని అన్నారు. హత్యా రాజ‌కీయాలు చేయ‌డం త‌న‌కు అల‌వాటుగా మారింద‌న్నారు. ఆపై త‌మ‌పై బుర‌ద జ‌ల్ల‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు నిమ్మ‌ల రామానాయుడు.

అమరావతి లో జరుగుతున్న పనులు చూసి జగన్ కి భయం మొదలైంద‌న్నారు. అందుకే అమరావతి పై జగన్ విషం కక్కుతున్నాడని మండిప‌డ్డారు. జగన్ మళ్ళీ సీఎం అయితే పొట్టేలు తలల స్థానంలో ప్రజల తలలు నరుకుతాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కి 11 సీట్లు కుడా రావు అని జోష్యం చెప్పారు. ఇదిలా ఉండ‌గా రెండో వారం నో వెహికల్ డే సందర్భంగా పాలకొల్లు నుండి ట్రైన్ లో సాధారణ ప్రయాణికులతో కలసి విజయవాడ చేరుకున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుండి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు సైకిల్ తొక్కాడు.

  • Related Posts

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం

    న్యూఢిల్లీ : సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ…

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *