ఎండ వేడిమి ఉంటే సెల‌వులు ప్ర‌క‌టించండి

సీఎం చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో వ‌డ‌గాలులు వీస్తున్నాయి. దీంతో సీఎం స‌చివాల‌యంలో అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు, వడ గాలుల నుంచి రక్షణ పొందేందుకు సన్నద్ధత చర్యల పై ఆరా తీశారు. హీట్ వేవ్ పరిస్థితిని ఎదుర్కోనేలా ఎక్కడికక్కడ టెంట్లు, చలివేంద్రాలు, చల్లని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ల‌క్ష్యం వ‌హించ వ‌ద్ద‌ని సూచించారు. ఎప్ప‌టిక‌ప్పుడు జిల్లా క‌లెక్ట‌ర్లు మానిట‌రింగ్ చేయాల‌న్నారు సీఎం.

అంతే కాకుండా సీఎం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా శెలవులు ప్రకటించేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎండల తీవ్రత, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా జిల్లా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించాలని నిర్దేశించారు. సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్, విపత్తు నిర్వహణ, వైద్యారోగ్య, పురపాలక, పంచాయితీరాజ్ శాఖ ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

  • Related Posts

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో మంత్రి ఎస్. స‌విత బిజీ

    అమరావతి : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *