ఎండ వేడిమి ఉంటే సెల‌వులు ప్ర‌క‌టించండి

సీఎం చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో వ‌డ‌గాలులు వీస్తున్నాయి. దీంతో సీఎం స‌చివాల‌యంలో అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు, వడ గాలుల నుంచి రక్షణ పొందేందుకు సన్నద్ధత చర్యల పై ఆరా తీశారు. హీట్ వేవ్ పరిస్థితిని ఎదుర్కోనేలా ఎక్కడికక్కడ టెంట్లు, చలివేంద్రాలు, చల్లని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ల‌క్ష్యం వ‌హించ వ‌ద్ద‌ని సూచించారు. ఎప్ప‌టిక‌ప్పుడు జిల్లా క‌లెక్ట‌ర్లు మానిట‌రింగ్ చేయాల‌న్నారు సీఎం.

అంతే కాకుండా సీఎం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా శెలవులు ప్రకటించేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎండల తీవ్రత, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా జిల్లా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించాలని నిర్దేశించారు. సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్, విపత్తు నిర్వహణ, వైద్యారోగ్య, పురపాలక, పంచాయితీరాజ్ శాఖ ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *