29వ తేదీన పౌర్ణమి గరుడ సేవ
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. వచ్చే జూన్ నెలలో తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో విశేష పర్వదినాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది టీటీడీ. ఇదిలా ఉండగా జూన్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
పర్వదినాలలో భాగంగా జూన్ 11వ తేదీన సర్వ ఏకాదశి నిర్వహించనున్నారు. 13న మాస శివరాత్రి, 26న
శ్రీవారి జ్యేష్టాభిషేకం ప్రారంభం జరుగుతుందని తెలిపింది టీటీడీ. జూన్ 27న శ్రీ నాధమునుల వర్ష తిరు నక్షత్రం ఉంటుందని, 28న శ్రీవారి జ్యేష్టాభిషేకం సమాప్తం అవుతుందని పేర్కొంది. ఇదిలా ఉండగా అత్యంత విశిష్టమైన పర్వదినంగా జూన్ 29న పౌర్ణమి గరుడ సేవ జరుగుతుందని వెల్లడించింది. ఇక వేసవి సెలవులు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు తిరుమల క్షేత్రానికి. దీంతో ముందు జాగ్రత్తగా జూలై 15 వరకు బ్రేక్ దర్శనానికి సంబంధించి సిఫారసు లెటర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.








