సిద్దరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య వార్
బెంగళూరు : కర్ణాటకలో రాజకీయం రసకందాయకంగా మారింది. నిన్నటి దాకా ఊరిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు ఎవరిని వరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ హైకమాండ్ ఎవరూ ఊహించని రీతిలో ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సిద్దరామయ్యను తప్పించింది. తనను రాజీనామా చేయాలని కోరింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం. గత కొంత కాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతూ వస్తోంది సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య. దీంతో చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పించింది పార్టీ అధిష్టానం. ఇదిలా ఉండగా ఈ మొత్తం వ్యవహారంపై స్పందించారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు డి. వి. సదానంద గౌడ .
గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. .అన్నీ సజావుగా సాగడం లేదు. కేంద్ర నాయకులు, సిద్ధరామయ్య, డి.కె. శివకుమార్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినప్పటికీ, వారు తీసుకున్న నిర్ణయం స్పష్టంగా తెలియ జేయబడలేదని అన్నారు. అయితే, సిద్ధరామయ్య ఈ రోజే రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దురదృష్టవశాత్తు, వ్యక్తిగత కారణాల రీత్యా గవర్నర్ తన స్వస్థలానికి వెళ్లడంతో ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరన్నారు సదానంద గౌడ. ఈ అధికార మార్పిడి ప్రక్రియలో ఏదో తేడా ఉన్నట్లు అనిపిస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి పదవిని డి.కె. శివకుమార్కు అప్పగించే ప్రక్రియ సజావుగా సాగడం లేదని అనుమానం వ్యక్తం చేశారు.





