అరుదైన నాయ‌కుడు సిద్ద‌రామ‌య్య : భ‌వ్య మూర్తి

Spread the love

రాజ‌కీయాల‌లో ఇలాంటి నేత‌లు చాలా అరుదు

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు సిద్ద‌రామ‌య్య‌. ఈ సంద‌ర్బంగా ఆయ‌న త‌ప్పుకోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీనియ‌ర్ నాయ‌కురాలు భ‌వ్య న‌ర‌సింహ మూర్తి. సదా నా నాయకుడు, నా గురువు.నా ఆదర్శం ఆయ‌నేన‌ని పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడి, తన స్వచ్ఛమైన పరిపాలన ద్వారా రాజకీయాల్లో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన మహనీయుడు సిద్ద‌రామ‌య్య అని ప్ర‌శంసించారు భ‌వ్య‌. కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. సాధారణ కుటుంబం నుంచి ఎదిగి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు సార్లు పనిచేసి ప్రత్యేకత‌ను చాటుకున్నార‌ని తెలిపారు.

ఇదిలా ఉండ‌గా సిద్ద‌రామ‌య్య 12 ఆగస్టు 1948లో పుట్టారు. న్యాయ‌వాది, లెక్చ‌ర‌ర్ గా కూడా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. మొదట జనతా దళ్‌లో రాజకీయ జీవితం ప్రారంభించారు. అనంత‌రం కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక నాయకుడిగా ఎదిగారు. 2013లో మొదటిసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా అయ్యారు. 2013–2018 మధ్య పూర్తి 5 సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసిన అరుదైన సీఎంగా నిలిచారు .సిద్ధరామయ్య ప్రభుత్వానికి “భాగ్య” పథకాలు ప్రసిద్ధి. అన్న భాగ్య‌, క్షీర భాగ్య‌, విద్యా సిరి, రైతు సంక్షేమ ప‌థ‌కాలు ముఖ్యంగా ఉన్నాయి.

  • Related Posts

    క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య రాజీనామా

    Spread the love

    Spread the loveవిధానసౌధలో రాజీనామా లేఖను సమర్పించిన సీఎం బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు సిద్ద‌రామ‌య్య‌. ఆయ‌న గురువారం విధాన సౌధ‌లో రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌ర్ ప‌ని మీద మ‌రాఠాకు వెళ్లారు. దీంతో విధాన‌స‌భ‌లో…

    క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయ సంక్షోభం : స‌దానంద గౌడ‌

    Spread the love

    Spread the loveసిద్ద‌రామ‌య్య‌, డీకే శివ‌కుమార్ ల మ‌ధ్య వార్ బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయం ర‌స‌కందాయ‌కంగా మారింది. నిన్న‌టి దాకా ఊరిస్తూ వ‌చ్చిన ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇప్పుడు ఎవ‌రిని వ‌రిస్తుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. కాంగ్రెస్ హైక‌మాండ్ ఎవ‌రూ ఊహించ‌ని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *