లిక్క‌ర్ స్కామ్ లో నేను సూత్ర‌ధారి కాదు

మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి కామెంట్స్

విజ‌య‌వాడ : మాజీ వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. లిక్క‌ర్ స్కామ్ కు సంబంధించి త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు. ఆయ‌న మ‌రోసారి ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే నొక్కి చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. గతంలో నా నివాసంలో జరిగిన సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌పై ఉన్న సీలును ఈడీ అధికారులు ఈ రోజు తొలగించార‌ని వెల్ల‌డించారు. అయితే ఈడీ అధికారులు ఎటువంటి విచారణ జరప లేద‌న్నారు విజ‌య సాయి రెడ్డి. వారు కేవలం ఫోన్‌లోని డేటాను మాత్రమే సేకరించారని చెప్పారు.

సేకరించిన ఆ డేటా ఆధారంగా, వారు ప్రశ్నలను రూపొందించి, వేరొక రోజు విచారణకు హాజరు కావాలని నాకు సమన్లు ​​జారీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు మాజీ ఎంపీ. ఈ ‘లిక్కర్ పిరమిడ్ స్కీమ్’ వ్యవహారంలో, ‘రాజ్ కాసిరెడ్డి’ అనే వ్యక్తే అసలైన సూత్రధారి, కార్యకర్త , ప్రధాన పాత్రధారి అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌కు ఈ స్కాంతో ఎలాంటి సంబంధం లేద‌న్నారు. కానీ కొంద‌రు కావాల‌ని త‌న పేరును ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్నారు. ఆ రోజు నేను చెప్పిన మాటే, ఈ రోజు కూడా చెబుతున్నాను.. భవిష్యత్తులోనూ నేను ఈ మాటలకు కట్టుబడి ఉంటానని ప్ర‌క‌టించారు.

  • Related Posts

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో మంత్రి ఎస్. స‌విత బిజీ

    అమరావతి : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *