పంపిణీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి
గుంటూరు జిల్లా : కురమ సంక్షేమ సంఘం ఆధ్వర్యలో కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గానికి చెందిన 104 మంది విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలను మంత్రి సవిత అందజేశారు. రూ.3.30 లక్షల విలువ చేసే నగదు ప్రోత్సాహకాలు మంత్రి చేతుల మీదుగా ఇవ్వడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.. టెన్త్ తో పాటు సెకండ్ ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన వారికి ఈ ప్రోత్సాహకాలు అందజేశారు. టెన్త్, సెకండ్ ఇంటర్ లో కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గంలో మొదటి అయిదు స్థానాల్లో నిలిచిన ఇద్దరు విద్యార్థులకు రూ.5 వేల చొప్పున రూ.10 వేలు అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన 20 మంది టెన్త్, ఇంటర్ విద్యార్థులకు రూ.3 వేల చొప్పున రూ.30 వేలు ఇచ్చారు.
తృతీయ స్థానంలో నిలిచిన 20 మంది విద్యార్థులకు రూ.2 వేలు చొప్పున రూ.40 వేలు అందజేశారు. మరో 120 మంది విద్యార్థులకు రూ.వెయ్యి చొప్పున రూ.లక్షా 20 వేలు ప్రోత్సాహక నగదు రూపంలో అందజేశారు .అత్యుమ్మ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సొంతంగా రూ.లక్ష నగదు, 200 స్కూల్ బ్యాగ్ లను మంత్రి సవిత అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ లో, ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గానికి చెందిన నలుగురు విద్యార్థులకు రూ.25 వేల చొప్పున రూ.లక్ష లను మంత్రి సవిత తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. 200 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేశారు.






