ప్ర‌త్య‌ర్థులపై దాడి చేయ‌డం పైనే ఫోక‌స్

యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ కామెంట్స్

అహ్మదాబాద్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు బీహార్ కు చెందిన యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ. త‌ను ఏకంగా 76 సిక్సులు కొట్టాడు. క‌గిసో ర‌బాడా, పాట్ కమిన్స్, భువేన‌శ్వ‌ర్ కుమార్, సిరాజ్ , ఇలా చెప్పుకుంటూ పోతే టాప్ క్లాస్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. త‌ను ప‌లుమార్లు సెంచ‌రీకి చేరువ‌లో వ‌చ్చి చేయ‌కుండానే పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. ఎలిమినేట‌ర్ -2 మ్యాచ్ లో త‌ను 96 ర‌న్స్ చేశాడు. ఇక ఫైన‌ల్ మ్యాచ్ లో తాము ఆర్సీబీతో ఆడుతామ‌ని అనుకున్నాన‌ని కానీ త‌మ ఆశ‌ల‌పై గుజ‌రాత్ టైటాన్స్ నీళ్లు చ‌ల్లింద‌న్నాడు. ఈ సంద‌ర్బంగా త‌ను కూడా అహ్మ‌దాబాద్ కు చేరుకున్నాడు ఫైన‌ల్ మ్యాచ్ చూశాడు.

మ్యాచ్ అనంత‌రం ఆర్సీబీ అద్భుత‌మైన ఆట‌తీరుతో ఐపీఎల్ 19 సీజ‌న్ విజేత‌గా నిలిచింది. ర‌న్ మెషీన్ మ‌రోసారి మెరిసాడు. త‌ను ఒక్కేడ 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో స‌త్తా చాటాడు. 75 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడాడు వైభ‌వ్ సూర్య‌వంశీ. ఈ సీజన్‌లో, ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఎలా ఆడాలి, అలాగే సందర్భానికి అనుగుణంగా నా ఆట తీరును ఎలా మార్చుకోవాలి అనే విషయాలను నేను నేర్చుకున్నాను.ప్రతి మ్యాచ్‌నూ ఒకే రకమైన మనస్తత్వంతో ఆడలేమన్నాడు. మీరు ఆటలోని పరిస్థితిని అంచనా వేసి, జట్టుకు ఆ సమయంలో ఏది అవసరమో దానికి అనుగుణంగా ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

  • Related Posts

    వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక క‌రెక్టు కాదు

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఆశించిన…

    వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో ఎంఎస్ ధోనీ ఆడ‌టం క‌ష్ట‌మే

    చెన్నై : భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. త‌న సార‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప‌లుమార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను స్వంతం చేసుకుంది. ప‌లువురిని మార్చింది సీఎస్కే యాజ‌మాన్యం.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *