రేవంత్ రెడ్డి , ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై జ‌గదీశ్ రెడ్డి ఫైర్

Spread the love

ఇద్ద‌రూ క‌లిసి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్ప‌డ్డారు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఇవాళ మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలో స‌వాల‌క్ష స‌మ‌స్య‌లు పేరుకు పోయాయ‌ని, దీనిని ప‌రిష్క‌రించే ధైర్యం, ద‌మ్ము, చేత‌కాక ఇలాంటి చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆరు గ్యారెంటీల అమ‌లులో ప్ర‌భుత్వం పూర్తిగా వైఫ‌ల్యం చెందింద‌ని ఫైర్ అయ్యారు. ప్ర‌జ‌ల నుంచి ఆగ్ర‌హం వ్య‌క్తం కావ‌డంతో ఈ ఇద్ద‌రు నేత‌లు క‌లిసి కొత్త ప్లాన్ కు తెర లేపార‌న్నారు.

ఇక్కడి ప్రజా సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు జ‌గ‌దీశ్ రెడ్డి. పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశం నిర్వహిస్తే, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయా? అని ప్ర‌శ్నించారు. తాము అనుమతి ఇవ్వలేదని చెప్పడమే వారి ‘మ్యాచ్ ఫిక్సింగ్’ను బట్టబయలు చేస్తోందని అన్నారు. ఇలాంటి చిల్ల‌ర మ‌ల్ల‌ర రాజ‌కీయాలు చేస్తే ప్ర‌జ‌లు ఛీ కొట్ట‌డం ఖాయ‌మ‌న్నారు. అస‌లు ఏపీలో ఉండాల్సిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు తెలంగాణలో ఏం ప‌ని అని నిల‌దీశారు.

  • Related Posts

    సాగు కోసం నాణ్య‌మైన విత్త‌నాల స‌ర‌ఫ‌రా

    Spread the love

    Spread the loveమంత్రి అచ్చెన్నాయుడు వెల్ల‌డి అమ‌రావ‌తి : వ్య‌వ‌సాయ రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు త‌మ స‌ర్కార్ కృషి చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. సాగుకు సంబంధించి రైతుల‌కు మెరుగైన‌, నాణ్య‌వంత‌మైన విత్త‌నాల‌ను స‌ర‌ఫ‌రా…

    తెలంగాణ మీ అయ్య జాగీరా..?

    Spread the love

    Spread the loveపవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు హైద‌రాబాద్ : జ‌న‌సేన పార్టీ చీఫ్‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి తెలంగాణ‌పై నోరు పారేసుకున్నారు. రెచ్చ‌గొట్టేలా మాట్లాడారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *