స్టూడెంట్స్ కు త‌మిళ‌నాడు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంద‌రికీ ఉచిత బ‌స్ పాస్

చెన్నై : త‌మిళ‌నాడులో కొలువు తీరిన టీవీకే కూట‌మి ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంద‌రికీ ఉచితంగా బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. తాను ప‌డిన క‌ష్టాల‌ను ఆయ‌న ఇత‌ర విద్యార్థులు ఎవ‌రూ ప‌డ‌కూడ‌ద‌ని పిల్ల‌ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌ని ప్ర‌క‌టించారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ విధమైన వెసులు బాటును కల్పిస్తుంది. పాఠశాలలు , కళాశాలలు తిరిగి తెరిచినప్పుడు, కొత్త స్మార్ట్ బస్ పాస్‌లు జారీ కావడానికి కొంత సమయం పడుతుంది. ఆ లోపు విద్యార్థులు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిబంధనల ప్రకారం పాఠశాల విద్యార్థులు స్కూల్ యూనిఫాం ధరించి లేదా తమ పాత బస్ పాస్/గుర్తింపు కార్డు (ID Card) చూపించి ప్రభుత్వ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు తమ విద్యా సంస్థలు జారీ చేసిన ప్రస్తుత లేదా పాత గుర్తింపు కార్డులను (ID Cards) చూపిస్తూ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందవచ్చని స్ప‌ష్టం చేసింది స‌ర్కార్. కొత్త బస్ పాస్‌ల పంపిణీ ప్రక్రియ పూర్తయ్యే వరకు విద్యార్థులందరికీ రవాణా సౌకర్యం సజావుగా సాగేలా చూడాలని ఆదేశించింది.

  • Related Posts

    స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధించ‌గ‌లం

    అమరావతి : స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ,…

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *