ప‌వ‌న్ క‌ళ్యాణ్ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి

డిమాండ్ చేసిన టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత

హైద‌రాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శ‌నివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ‌పై ఇంకోసారి నోరు పారేసుకుంటే చీల్చి చెండాడుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ చ‌రిత్ర ఎక్క‌డ‌..? ఆంధ్రా చ‌రిత్ర ఎక్క‌డ తెలుసుకుని మాట్లాడాల‌న్నారు. కావాల‌ని ఇక్క‌డికి వ‌చ్చి రాజ‌కీయాలు చేయాల‌ని చూస్తే ఇక్క‌డ ఎవ‌రూ చూస్తూ ఊరుకోర‌ని అన్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ముమ్మాటికీ తెలంగాణ మాదేన‌ని ప్ర‌క‌టించారు.

తెలంగాణ అన్న ప‌దం డిక్ష‌న‌రీలోనే లేద‌ని బక్క‌ని న‌ర్సిములు చెప్ప‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఆయ‌న‌కు సోయి అనేది లేద‌న్నారు క‌విత‌. తెలంగాణ మాదేన‌ని, మా జాగీరేన‌ని స్ప‌ష్టం చేశారు. ఇది పవన్ కల్యాణ్ తాతా ముత్తాతల జాగీరు కాదన్నారు. ఆంధ్రకు చెందిన మీ విషపూరిత పంజా నుండి మిమ్మల్ని కాపాడటానికే మేము తెలంగాణను సాధించుకున్నాం అన్నారు. ఇప్పుడు, ఇక్కడికి వచ్చి రాజకీయం చేయడంలో మీకున్న నైతికత ఏమిటి? అని ప్ర‌శ్నించారు. ఇక‌నైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

  • Related Posts

    స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధించ‌గ‌లం

    అమరావతి : స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ,…

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *