విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాక‌రం

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ దిగ్భ్రాంతి

అమ‌రావ‌తి : ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకున్న ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని తెలిపారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన చికిత్స అంద‌జేస్తున్నామ‌న్నారు. ప్రమాదం గురించి విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. స్టీల్ ప్లాంట్ లో చేపట్టిన సహాయ చర్యలపై ఆరా తీశారు. అధికారులంతా సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని దిశా నిర్దేశం చేశారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు. కూటమి ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భ‌రోసా ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఇవాళ ఆయ‌న బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. మ‌రో వైపు కేంద్ర‌, రాష్ట్ర మంత్రులు ఘ‌ట‌నా స్థ‌లం వ‌ద్ద‌నే ఉన్నారు. స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా మృతుల కుటుంబాల‌కు రూ. 25 ల‌క్ష‌లు, గాయ‌ప‌డిన వారికి రూ. 10 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్ గ్రేషియా స‌ర్కార్ ప్ర‌క‌టించింది.

  • Related Posts

    స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధించ‌గ‌లం

    అమరావతి : స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ,…

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *