డీజీపీని క‌లిసిన మంద‌కృష్ణ మాదిగ‌

Spread the love

సీవీ ఆనంద్ కు ఎంఆర్పీఎస్ చీఫ్ కంగ్రాట్స్

హైద‌రాబాద్ : తెలంగాణ నూత‌న డీజీపీగా కొలువు తీరిన సీవీ ఆనంద్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి (ఎంఆర్పీఎస్) అధ్య‌క్షుడు , ప‌ద్మ‌శ్రీ మంద‌కృష్ణ మాదిగ‌. ఈ సందర్భంగా C.V ఆనంద్ కి మంద కృష్ణ మాదిగ పుష్పగుచ్చం అందించి , శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియ చేశారు. ఈ సందర్భంగా MRPS మొదటి దశ ఉద్యమం జరుగుతున్న సందర్భంగా బషీర్ బాగ్ చౌరస్తాలో పోలీసు అధికారిగా విధులు నిర్వర్తించిన విషయాన్ని C.V ఆనంద్ గుర్తు చేసుకున్నారు.

పోలీసు శాఖలో అపారమైన అనుభవం కలిగిన C.V ఆనంద్ తెలంగాణ రాష్ట్ర DGP గా నియమితులు కావడం సంతోషకరమని మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ కార్యక్రమంలో MRPS రాష్ట్ర అధ్యక్షులు డా.గోవిందు నరేష్ మాదిగ, MSP జాతీయ నేత తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ప్రముఖ గేయ రచయిత నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ , సినిమా దర్శకులు ప్రేమ్ రాజు, MSF రాష్ట్ర కార్యదర్శి బైరపోగు శివ కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జగన్ పేరులో జీ అంటే గొడ్డలి : లోకేష్

    Spread the love

    Spread the loveరెండేళ్లుగా సుపరిపాలన అందించాం తిరుప‌తి : ప్రజా ప్రభుత్వం రెండేళ్ళ పాలనలో సుపరిపాలన అందించాం అన్నారు మంత్రి నారా లోకేష్‌. అన్నీ చేసేశామని కాలర్ ఎగరేయడం లేదు. ఆర్థిక ఇబ్బందులున్నా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు…

    మీనాక్షి నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ అప్ర‌జాస్వామికం

    Spread the love

    Spread the loveశివ‌సేన యుబిటీ నాయ‌కురాలు ప్రియాంక చ‌తుర్వేది ముంబై : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్య‌వహారాల ఇంఛార్జ్ , సీనియ‌ర్ నాయ‌కురాలు మీనాక్షి న‌ట‌రాజ‌న్ రాజ్య‌స‌భ నామినేష‌న్ ను చిన్న‌కార‌ణం పేరుతో తిర‌స్క‌రించ‌డం ప‌ట్ల స్పందించారు శివసేన (UBT)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *