డీజీపీని క‌లిసిన మంద‌కృష్ణ మాదిగ‌

సీవీ ఆనంద్ కు ఎంఆర్పీఎస్ చీఫ్ కంగ్రాట్స్

హైద‌రాబాద్ : తెలంగాణ నూత‌న డీజీపీగా కొలువు తీరిన సీవీ ఆనంద్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి (ఎంఆర్పీఎస్) అధ్య‌క్షుడు , ప‌ద్మ‌శ్రీ మంద‌కృష్ణ మాదిగ‌. ఈ సందర్భంగా C.V ఆనంద్ కి మంద కృష్ణ మాదిగ పుష్పగుచ్చం అందించి , శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియ చేశారు. ఈ సందర్భంగా MRPS మొదటి దశ ఉద్యమం జరుగుతున్న సందర్భంగా బషీర్ బాగ్ చౌరస్తాలో పోలీసు అధికారిగా విధులు నిర్వర్తించిన విషయాన్ని C.V ఆనంద్ గుర్తు చేసుకున్నారు.

పోలీసు శాఖలో అపారమైన అనుభవం కలిగిన C.V ఆనంద్ తెలంగాణ రాష్ట్ర DGP గా నియమితులు కావడం సంతోషకరమని మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ కార్యక్రమంలో MRPS రాష్ట్ర అధ్యక్షులు డా.గోవిందు నరేష్ మాదిగ, MSP జాతీయ నేత తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ప్రముఖ గేయ రచయిత నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ , సినిమా దర్శకులు ప్రేమ్ రాజు, MSF రాష్ట్ర కార్యదర్శి బైరపోగు శివ కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *