అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న సీజే లీనా గిల్

VijayaBhaskar · June 13, 2026
Spread the love

శ్రీ కపిలేశ్వర స్వామిని దర్శించుకున్న సీజే

తిరుపతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. ఘ‌న స్వాగ‌తం ప‌లికారు టీటీడీ చైర్మ‌న్ నాయుడుతో పాటు ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌, ఏఈవో చౌద‌రితో పాటు ఆల‌య అర్చ‌కులు . అనంత‌రం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మ వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ప‌ద్మావ‌తి అమ్మ వారి అనుగ్రహాన్ని పొందారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఇదిలా ఉండ‌గా అంతకు ముందు జస్టిస్ లీసా గిల్ తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయానికి చేరుకోగానే సీజేకు టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్, శ్రీమతి నాగరత్న, విజిఓ గిరిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ప్ర‌దాన న్యాయ‌మూర్తి రాక సంద‌ర్బంగా భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.