ఎంపీలు రాజ్యాంగ స్పూర్తిని విస్మ‌రించొద్దు

Spread the love

దిశా నిర్దేశం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల

న్యూఢిల్లీ : జనసేన ఢిల్లీ వేదికగా ఎప్పుడు దేశ ప్రగతి, ఉన్నతి, పురోగతి కోసమే ఆలోచన చేస్తుందని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ . ఢిల్లీలో మంగ‌ళ‌వారం జ‌రిగిన స‌మావేశంలో ఆయన ప్ర‌సంగించారు.. ఇలాంటి గొప్ప వేదికను దేశ ఐక్యత, సమగ్రత కోసం ఉపయోగించుకుంటాం అన్నారు. .జనసేన పార్టీకి లోక్ సభలో ఇద్దరు ఎంపీలు, రాజ్యసభలో ఒక ఎంపీ బలం ఉంది. పార్టీ ఎంపీలపై చాలా పెద్ద బాధ్యత ఉంది. కేవలం వారి నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలను మాత్రమే సభలో మాట్లాడొద్దు. ఎంపీలు యావత్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారనే విషయాన్ని మరిచిపోకండి. రాజ్యంగ స్ఫూర్తిని విస్మరించొద్దు అని సూచించారు.

దేశ ప్రతిష్టకు భంగా కలిగించే అంశాలు, సమగ్రతను నష్టం చేకూర్చే విషయాలపై జనసేన గళాన్ని పార్లమెంటు వేదికగా దేశం మొత్తానికి తెలిసేలా మాట్లాడాల‌ని పిలుపునిచ్చారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో జరిగే జాతి ప్రాధాన్య అంశాల పట్ల పార్టీ గళాన్ని ప్రజలకు వినిపించాలి. రాజ్యాంగ విలువలను కాపాడాలి. దీనికి ముగ్గురు ఎంపీలు బాధ్యతగా తీసుకోవాలి. దేశ సంక్షేమానికి విఘాతం కలిగించే ప్రతి అంశంపైనా స్పందించాలి. కేవలం గిరి గీసుకొని నియోజకవర్గ సమస్యలనే ప్రస్తావించి ఆగిపోవద్దు. దేశ ప్రయోజనాలే తొలి ప్రాధాన్యం కావాలని అన్నారు.

  • Related Posts

    ఎస్ఎస్ సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల రిజ‌ల్ట్స్

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఎస్ఎస్ సీ అడ్వాన్స్ డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు(ఏ.ఎస్.ఇ) – మే 2026 ఫలితాలను ప్రకటించింది. ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు విద్యా శాఖ…

    20 వేల మందికి పైగా ఉపాధి కల్పన

    Spread the love

    Spread the loveజేఎస్ఎస్ మ‌హా విద్యా పీఠ్ ప్ర‌క‌ట‌న తిరుప‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ఒప్పందం చేసుకుంది క‌ర్ణాట‌క‌కు చెందిన ప్ర‌ముఖ విద్యా సంస్థ జేఎస్ఎస్ మ‌హా విద్యాపీఠ్. ఈ ఒప్పందం ప్రకారం తిరుపతిలో భూమి కేటాయింపు, అవసరమైన చట్టబద్ధ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *