అభినందించిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : డ్రోగో ఏరోస్పేస్ రక్షణ ఉత్పత్తులను కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తి జిల్లాలో జరిగిన రక్షణ ఉత్పత్తుల కేంద్రం, డ్రోన్ సిటీ శంఖుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో డ్రోగో ఏరో స్పేస్ తన ఉత్పత్తులను ప్రదర్శించింది. వాటిని పరిశీలించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. వాటి తయారీకి ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం , వారి శక్తి సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డ్రోగో సంస్థ అభివృద్ధి, డ్రోగో ఏరోస్పేస్గా మార్పు, స్వదేశీ సాంకేతికత ద్వారా భారత సాయుధ దళాలను బలోపేతం చేయడానికి సంస్థ చేస్తున్న కృషిని వారు అభినందించారు. దేశీయ రక్షణ తయారీ రంగంలో యువ భారతీయ సంస్థలు పోషిస్తున్న పాత్రను సంస్థ సీఈఓ యశ్వంత్ బొంతు వారికి వివరించారు .రక్షణ ఉత్పత్తుల కేంద్రం, డ్రోన్ సిటీ శంఖుస్థాపన కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు యశ్వంత్ బొంతు కూడా పాల్గొన్నారు.





