డ్రోగో ఏరో స్పేస్ కు రక్షణ మంత్రి ప్ర‌శంస

అభినందించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : డ్రోగో ఏరోస్పేస్ రక్షణ ఉత్పత్తులను కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తి జిల్లాలో జరిగిన రక్షణ ఉత్పత్తుల కేంద్రం, డ్రోన్ సిటీ శంఖుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో డ్రోగో ఏరో స్పేస్ తన ఉత్పత్తులను ప్రదర్శించింది. వాటిని పరిశీలించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. వాటి తయారీకి ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం , వారి శక్తి సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డ్రోగో సంస్థ అభివృద్ధి, డ్రోగో ఏరోస్పేస్‌గా మార్పు, స్వదేశీ సాంకేతికత ద్వారా భారత సాయుధ దళాలను బలోపేతం చేయడానికి సంస్థ చేస్తున్న కృషిని వారు అభినందించారు. దేశీయ రక్షణ తయారీ రంగంలో యువ భారతీయ సంస్థలు పోషిస్తున్న పాత్రను సంస్థ సీఈఓ యశ్వంత్ బొంతు వారికి వివరించారు .రక్షణ ఉత్పత్తుల కేంద్రం, డ్రోన్ సిటీ శంఖుస్థాపన కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు యశ్వంత్ బొంతు కూడా పాల్గొన్నారు.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *