డ్రోగో ఏరో స్పేస్ కు రక్షణ మంత్రి ప్ర‌శంస

Spread the love

అభినందించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : డ్రోగో ఏరోస్పేస్ రక్షణ ఉత్పత్తులను కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తి జిల్లాలో జరిగిన రక్షణ ఉత్పత్తుల కేంద్రం, డ్రోన్ సిటీ శంఖుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో డ్రోగో ఏరో స్పేస్ తన ఉత్పత్తులను ప్రదర్శించింది. వాటిని పరిశీలించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. వాటి తయారీకి ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం , వారి శక్తి సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డ్రోగో సంస్థ అభివృద్ధి, డ్రోగో ఏరోస్పేస్‌గా మార్పు, స్వదేశీ సాంకేతికత ద్వారా భారత సాయుధ దళాలను బలోపేతం చేయడానికి సంస్థ చేస్తున్న కృషిని వారు అభినందించారు. దేశీయ రక్షణ తయారీ రంగంలో యువ భారతీయ సంస్థలు పోషిస్తున్న పాత్రను సంస్థ సీఈఓ యశ్వంత్ బొంతు వారికి వివరించారు .రక్షణ ఉత్పత్తుల కేంద్రం, డ్రోన్ సిటీ శంఖుస్థాపన కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు యశ్వంత్ బొంతు కూడా పాల్గొన్నారు.

  • Related Posts

    ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం

    Spread the love

    Spread the loveఅత్యున్న‌త పౌర పుర‌స్కారంతో స‌త్కారం స్లోవేకియా : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీకి అరుదైన గౌర‌వం ల‌భించింది. ఆయ‌న ప్ర‌పంచంలో అత్యున్న‌త నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ప్ర‌ధానంగా యుద్దాన్ని నివారించ‌డంలో , శాంతి కోసం…

    స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు సిద్దం కావాలి

    Spread the love

    Spread the loveవిద్యార్థుల‌కు సుంద‌ర్ పిచాయ్ దిశా నిర్దేశంఅమెరికా : ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జ సంస్థలైన గూగుల్, ఆల్ఫా బెట్ కంపెనీల ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారిగా వ్య‌వ‌హ‌రిస్తున్న , ప్ర‌వాస భార‌తీయుడైన , చెన్నైకి చెందిన సుంద‌ర్ పిచాయ్ ఆస‌క్తిక‌ర…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *