డొనాల్డ్ ట్రంప్ తో ప్ర‌ధాని మోదీ భేటీ

Spread the love

కీల‌క అంశాల‌పై విస్తృత చ‌ర్చ‌లు

ఫ్రాన్స్ : విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు భార‌త దేశ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఈ సంద‌ర్బంగా ఆయ‌న జి 7 స‌ద‌స్సులో పాల్గొన్నారు. వివిధ దేశాల‌కు చెందిన ప్ర‌ధాన‌మంత్రులు, అధ్య‌క్షుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఎవియాన్‌లో అధ్యక్షుడు ట్రంప్‌ను కలుసుకున్నారు. త‌న‌ను క‌ల‌వ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు మోదీ. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సాంకేతికత , ప్రజల మధ్య సంబంధాల రంగాలలో మన ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర పురోగతిని తాము సమీక్షించడం జ‌రిగింద‌న్నారు.

పశ్చిమ ఆసియాలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలలో సాధిస్తున్న పురోగతి పట్ల భారతదేశం తరపున అభినందనలు తెలియజేశామ‌న్నారు మోదీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం అత్యంత కీలకం అని పేర్కొన్నారు. సముద్రయాన కార్మికులతో సహా పౌరుల భద్రత, రక్షణను నిర్ధారించాల్సిన ప్రాముఖ్యతను పునరుద్ఘాటించామని తెలిపారు.

  • Related Posts

    కృష్ణలంక సీఐపై విచార‌ణ‌కు ఆదేశం

    Spread the love

    Spread the loveఆదేశాలు జారీ చేసిన ఏపీ డీజీపీ విజ‌య‌వాడ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు రౌడీషీట‌ర్ లాక‌ప్ డెత్ పై స్పందించారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది.…

    ప్ర‌జ‌ల కోసం రిషికొండ ప్యాలెస్

    Spread the love

    Spread the loveఏపీ మంత్రుల బృందం ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ఏపీ స‌బ్ క‌మిటీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్రజాధనం ఎలా వృథా చేశారో చూపించడానికి టికెట్ పెట్టి ప్రజలను, స్కూల్ పిల్లలను సందర్శనకు అనుమతించాలని కొందరు కోరారన్నారు. కానీ ముఖ్యమంత్రి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *