సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేస్తాం

Spread the love

త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మికి భ‌రోసా ఇచ్చిన చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : ఏపీలో సంచ‌ల‌నం రేపింది విజ‌య‌వాడ కృష్ణ‌లంక సీఐ నాగ‌రాజు వ్య‌వ‌హారం. రౌడీ షీట‌ర్ సాయికృష్ణ‌ను లాక‌ప్ డెత్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ వ్య‌వ‌హారంలో త‌న‌ను స‌స్పెండ్ చేసింది స‌ర్కార్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర‌కు . ఇదిలా ఉండ‌గా గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. తన కుమారుడి అదృశ్యం ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెకు ధైర్యం చెప్పారు.

ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. విజయలక్ష్మితో మాట్లాడి మొత్తం ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. తన కుటుంబానికి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంపై విజయలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని గాదె విజయలక్ష్మి తెలిపారు.

  • Related Posts

    నేడే ఏపీ అన్న‌దాత సుఖీభ‌వ

    Spread the love

    Spread the loveచిల‌క‌లూరిపేట‌లో సీఎం పంపిణీ అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు శ‌నివారం ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట‌లో ప‌ర్య‌టిస్తారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పర్యటించనున్నారు. ఉదయం 11.55 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం…

    ఇజ్రాయెల్‌కు జేడీ వాన్స్‌ స్ట్రాంగ్ వార్నింగ్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఉపాధ్యక్షుడు అమెరికా : యుఎస్ దేశ ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ ఉన్న‌ట్టుండి తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌ధానంగా గ‌త కొంత కాలంగా ఇజ్రాయెల్ దేశానికి బేష‌ర‌తుగా , నిస్సిగ్గుగా మ‌ద్ద‌తు ఇస్తూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *