మోదీ నాయ‌క‌త్వంలో క్రీడా శక్తిగా భారత్

ప్ర‌శంసించిన‌ ఎంపీ రఘునందన్‌ రావు

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ బలమైన క్రీడా శక్తిగా ఎదుగుతోందని తెలంగాణ జిమ్నాస్టిక్స్‌ సంఘం అధ్యక్షుడు, మెదక్‌ పార్లమెంట్‌ సభ్యుడు మాధవనేని రఘునందన్‌ రావు అన్నారు. న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో జరుగుతున్న ఆసియా సీనియర్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ నాలుగో రోజు పోటీల ముగింపు కార్యక్రమానికి జాతీయ ఫెన్సింగ్‌ సంఘం ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ మెహతా ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖేలో ఇండియా, ఫిట్‌ ఇండియా, ఖేలో సన్స్‌ద్‌ ఉత్సవ్‌ వంటి కార్యక్రమాల ద్వారా గత పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో క్రీడా విప్లవానికి నాంది పలికారని కొనియాడారు.

ఈ కార్యక్రమాలు దేశంలో క్రీడా సంస్కృతిని బలోపేతం చేయడంతో పాటు యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాయని అన్నారు 30 దేశాల నుంచి 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్న ఆసియా సీనియర్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని పేర్కొన్నారు. ఒలింపియన్లు సహా ఆసియా ఖండంలోని ప్రముఖ ఫెన్సర్లతో భారత క్రీడాకారులు పోటీపడటం దేశంలో ఫెన్సింగ్‌ క్రీడాభివృద్ధికి ఎంతో ఉపయోగ పడుతుందని చెప్పారు.

  • Related Posts

    భ‌విష్య‌త్ త‌రాల కోస‌మే క్రీడా సంస్థ ఏర్పాటు

    విశాఖ‌ప‌ట్నం జిల్లా : భ‌విష్య‌త్ త‌రాల కోస‌మే విశాఖ‌ప‌ట్నంలో పీవీ సింధు పేరుతో అకాడమీని ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు. విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో పీవీ సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్…

    ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ అడ్వైజ‌ర్ రాజీనామా

    అమెరికా : ఇన్‌ఫాంటినో ప్రైవేట్ ఈక్విటీ ప్రణాళికకు నిరసనగా వైట్ హౌస్ వరల్డ్ కప్ ప్యానెల్‌లోని ఫిఫా సలహాదారు కార్లోస్ కోర్డెరో శుక్ర‌వారం రాజీనామా చేశారు. వరల్డ్ కప్‌లో వాటాను విక్రయించాలని ఫిఫా భావిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని మాజీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *