సీఎం సువేందుతో భావోద్వేగ బంధం

Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఎంపీ మోయిత్రా

న్యూఢిల్లీ : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన పార్ల‌మెంట్ స‌భ్యురాలు మ‌హూవా మోయిత్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ఆమె ఓ జాతీయ ఛాన‌ల్ తో జ‌రిగిన సంభాష‌ణ‌లో కీల‌క అంశాల గురించి స్పందించారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ లో సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన టీఎంసీ చీలి పోయింది. ఇప్పుడు దిక్కు తోచ‌ని స్థితిలో ఉంది మాజీ సీఎం, పార్టీ వ్య‌వ‌స్థాప‌కురాలు మ‌మ‌తా బెన‌ర్జీ. ప‌లువురు త‌ను తీసుకు వ‌చ్చి టికెట్లు ఇచ్చి గెలిపించిన వారంతా ప‌క్క‌దారి ప‌ట్టారు. వారంతా బేష‌ర‌తుగా, బ‌హిరంగంగానే బీజేపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. దీని వెనుక మాస్ట‌ర్ మైండ్ కేంద్ర మంత్రి అమిత్ షా ఉన్నాడ‌నేది జ‌గ‌మెరిగిన బ‌హిరంగ ర‌హ‌స్యం.

ఇది ప‌క్క‌న పెడితే తాజాగా మ‌హూవా మోయిత్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. త‌ను ప్ర‌స్తుతం దీదీని వ్య‌తిరేకించి సీఎంగా కొలువు తీరిన బీజేపీకి చెందిన సువేందు అధికారిపై ప్ర‌శంస‌లు కురిపించారు. త‌న‌తో భావోద్వేగ బంధం ఉందని చెప‌ప్పారు. నాకు లోక్‌సభ సీటు నిరాకరించినప్పుడు రాత్రంతా ఏడ్చాను. సువేందు నాకు ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. నేను కరీంపూర్ నుండి పోటీ చేసినప్పుడు, నా కోసం ఎవరూ ప్రచారం చేయలేదు. ఒక్కరూ కాదు. కేవలం సువేందు మాత్రమే వచ్చి నా కోసం ప్రచారం చేశార‌ని కితాబు ఇచ్చారు. మేమిద్దరం కలిసి పార్టీలో ఉన్నప్పుడు, ఆయన నాకు చాలా మద్దతు ఇచ్చార‌ని పేర్కొన్నారు ఎంపీ.

  • Related Posts

    రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు

    Spread the love

    Spread the love14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు విజ‌య‌వాడ : తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌నం సృష్టించింది రౌడీ షీట‌ర్ సాయికృష్ణ లాక‌ప్ డెత్ కేసు. ఈ ఘ‌ట‌న‌కు కార‌కుడైన సీఐ నాగ‌రాజును అదుపులోకి తీసుకున్నారు. త‌న‌ను విజ‌య‌వాడ కోర్టులో…

    తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టండి

    Spread the love

    Spread the loveపిలుపునిచ్చిన టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అమ‌రావ‌తి : త‌ప్పుడు ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్య‌త కార్య‌క‌ర్త‌ల‌పై ఉంద‌న్నారు టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్. సంక్షేమం చేపట్టినా ప్రజలకు దూరం కావడం వల్ల దేశంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *