జూన్ 30న రామ‌కృష్ణ రావు ప‌ద‌వీ విర‌మ‌ణ

Spread the love

త‌న స్తానంలో రానున్న సంజ‌య్ జాజు

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా సీనియ‌ర్ ఏఐఎస్ సంజ‌య్ జాజు రానున్నారు. ఈ మేర‌కు కేంద్రం ఓకే చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎస్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న రామ‌కృష్ణ‌రావు ప‌ద‌వీ కాలం జూన్ 30న ముగియ‌నుంది. ఇప్ప‌టికే ఆయ‌న రిటైర్ కావాల్సి ఉంది. కానీ ప్ర‌భుత్వ అభ్య‌ర్థ‌న మేర‌కు కేంద్రం కొన్ని నెల‌ల పాటు పొడిగించేందుకు ఒప్పుకుంది. ఇదే స‌మ‌యంలో సీఎస్ గా పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేశారు సీనియ‌ర్ ఐఏఎస్ లు జ‌యేష్ రంజ‌న్ , వికాస్ రాజ్. వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది స‌ర్కార్. ఇక సంజ‌య్ జాజుకు వృత్తి ప‌రంగా మంచి పేరుంది. ఆయ‌న 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వ్య‌క్తి. కీల‌క‌మైన శాఖ‌ల‌లో ప‌ని చేశారు. ఏపీలో 350 సేవ‌లను మీ సేవ ద్వారా పొందే వీలు క‌ల్పించారు.

సంజయ్ జాజు కేంద్ర స‌ర్వీసుల‌లో కూడా ప‌ని చేశారు . 2018 నుంచి 2023 వ‌ర‌కు ర‌క్ష‌ణ రంగంలో , 208 నుంచి 2020 వ‌ర‌కు జాయింట్ సెక్రట‌రీగా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్, రక్షణ మంత్రిత్వ శాఖ యూనియన్ లో సెక్రటరీ స్థాయి అధికారిగా ప‌ని చేశారు. 2024 నుంచి 2026 వ‌ర‌కు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ , బ్రాడ్ కాస్టింగ్ కార్య‌ద‌ర్శిగా , మినిస్ట్రీ ఆఫ్ డెవలప్‌మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు. ఏసీసీ ఆమోదంతో తిరిగి తెలంగాణ కేడ‌ర్ కు వ‌చ్చారు.

Related Posts

రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు

Spread the love

Spread the love14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు విజ‌య‌వాడ : తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌నం సృష్టించింది రౌడీ షీట‌ర్ సాయికృష్ణ లాక‌ప్ డెత్ కేసు. ఈ ఘ‌ట‌న‌కు కార‌కుడైన సీఐ నాగ‌రాజును అదుపులోకి తీసుకున్నారు. త‌న‌ను విజ‌య‌వాడ కోర్టులో…

తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టండి

Spread the love

Spread the loveపిలుపునిచ్చిన టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అమ‌రావ‌తి : త‌ప్పుడు ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్య‌త కార్య‌క‌ర్త‌ల‌పై ఉంద‌న్నారు టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్. సంక్షేమం చేపట్టినా ప్రజలకు దూరం కావడం వల్ల దేశంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *