స్త్రీ శ‌క్తి ప‌థ‌కం సాధికార‌త‌కు ద‌ర్ప‌ణం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి ఎస్. స‌విత

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక అభివృద్ది ప‌రుగులు పెడుతోంద‌ని చెప్పారు. గత ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచితే, మహిళా పక్షపాతి అయిన సీఎం చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కూడా నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి, వైసీపీ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. తమ ప్రభుత్వంలో కూడా సీఎంఆర్ఎఫ్ నిధులు ఇంత పెద్ద స్థాయిలో మంజూరు కాలేదని వారు చెప్పుకుంటున్నారన్నారు ఎస్. స‌విత‌.

ముఖ్యంగా పెనుకొండ నియోజక వర్గ వ్యాప్తంగా రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నామన్నారు. ముఖ్యంగా పెనుకొండ నియోజక వర్గంలో నేటి వరకూ రూ.13.40 కోట్లకుపైగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందజేశామన్నారు. నేడు 121 మంది లబ్దిదారులకు రూ.కోటీ 15 లక్షలను ఇచ్చామ‌న్నారు ఎస్. స‌విత .ఎస్. పెనుకొండ తన జాగీరేనని, గతంలో ఎన్నడూ జరగలేనంత అభివృద్ధి తన హయాంలోనే జరుగుతోందని మంత్రి సవిత స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగే హక్కు తమకే ఉందన్నారు. అనంతరం లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్ లను మంత్రి సవిత అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి అప్సరా రెడ్డి రాజీనామా

    చెన్నై : అన్నాడీఎంకే పార్టీ కి బిగ్ షాక్ త‌గిలింది. ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు అప్స‌రా రెడ్డి. ఈ సంద‌ర్బంగా త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ చీఫ్ కు పంపించారు. ఆ లేఖ‌లో కీల‌క…

    తుమ్మలను కలిసిన కోస్టారికా ఏఎస్‌డీ కంపెనీ ప్రతినిధులు

    హైద‌రాబాద్ : కోస్టారికా ఏఎస్డీ కంపెనీ ప్ర‌తినిధులు మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగుకు అవసరమైన నూతన తరం, అధిక నాణ్యత గల ఆయిల్‌పామ్ విత్తనాలను కోస్టారికా నుంచి సరఫరా చేసే అంశంపై మంత్రితో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *