ద‌ర్శ‌కుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు న‌మోదు

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుడ్లూరి అశోక్ బాబుకు షాక్ త‌గిలింది. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ లో దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు పై కేసు నమోదు చేశారు. . యువకుడిని హీరోగా పరిచయం చేస్తానంటూ మోసం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. యువకుడి తల్లిదండ్రుల దగ్గర్నుంచి మూడున్నర కోట్ల రూపాయలు తీసుకున్నట్లు వాపోయారు బాధితులు. ఈ మేర‌కు వారు సైబ‌రాబాద్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. దీంతో దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబును విచార‌ణ‌కు పిలిపించిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా స‌ద‌రు యువకుడిని హీరోగా చేయకుండా డబ్బులు ఇవ్వక పోవడంతో విసిగి పోయిన బాధితులు చివ‌ర‌కు ఖాకీల వ‌ద్ద‌కు వెళ్లారు.

బాధితుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు విచార‌ణ ప్రారంభించిన‌ట్లు టాక్. యువకుడి తండ్రి హనుమంతరావు ఇచ్చిన ఫిర్యాదు తో అశోక్ బాబుపై కేసు నమోదు.. నిర్మాత విజయలక్ష్మి, దర్శకుడు గుడ్లూరు అశోక్ బాబులను పిలిచి విచారిస్తున్నారు పోలీసులు. తమ కొడుకును హీరోగా చేస్తానని చెప్పి దర్శకుడు పలు దఫాలుగా డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. హీరోను చేయకపోగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదంటూ వాపోయారు. ఇదిలా ఉండ‌గా గుడ్లూరి అశోక్ బాబు తెలుగులో భాగమతి, పిల్ల జమిందార్, ఆకాశరామన్న లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

  • Related Posts

    యష్‌ను కలవడం చాలా ఆనందాన్నిచ్చింది

    ముంబై : ప్ర‌ముఖ బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. సోమ‌వారం ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా పాన్ ఇండియా స్టార్ హీరో య‌శ్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. త‌న‌ను క‌లిసిన సంద‌ర్బంగా దిగిన ఫోటోల‌ను షేర్…

    యష్ ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం

    హైదరాబాద్: హైద‌రాబాద్ లో ని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన యష్ చిత్రం ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సౌండ్ బాక్స్ సెటప్ కూలి పోవడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక విద్యార్థిని స్పృహ కోల్పోవడంతో ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *