ఈశ్వ‌ర‌మ్మ యాద‌వ్ పై శివ చ‌ర‌ణ్ రెడ్డి బూతు పురాణం

యాదాద్రి న‌ల్ల‌గొండ జిల్లా : తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా యాద‌గిరిగుట్ట ఆల‌యానికి సంబంధించి పాల‌క మండ‌లిని ఖ‌రారు చేసింది. ఇప్ప‌టికే తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది సర్కార్. త‌న‌కు తెలియ‌కుండానే క‌మిటీని ఎంపిక చేశారంటూ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎవ‌రికీ తెలియ‌కుండా, ఎవ‌రినీ సంప్ర‌దించ‌కుండానే త‌మ‌కు కావాల్సిన వారికి ప‌ద‌వులు క‌ట్టబెట్ట‌డం క‌ల‌క‌లం రేపింది. విచిత్రం ఏమిటంటే ఏనాడూ యాద‌గిరిగుట్ట న‌ర‌సింహ స్వామిని ద‌ర్శించుకోని చిరంజీవి భార్య సురేఖ‌కు ఇందులో చోటు క‌ల్పించారు సీఎం రేవంత్ రెడ్డి.

ఈ త‌రుణంలో బీసీ మహిళ నాయకురాలు, యాదగిరిగుట్ట పాలకమండలి సభ్యురాలైన‌ ఈశ్వరమ్మ యాదవ్ పై తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివ చరణ్ రెడ్డి బూతు మాట‌ల‌తో రెచ్చి పోయాడు. మా నాన్న ఫోటో ఫ్లెక్సీలో పెట్టారా అంటూ, ఈశ్వరమ్మ యాదవ్ పై బూతులతో ఊగి పోయాడు . ఈశ్వరమ్మ యాదవ్ బోసిడి ముండ అంటూ, అగౌరపరిచిన ఆడియో విడుదల చేశాడు. ఈశ్వరమ్మ యాదవ్ అంతు చూస్తానంటూ, అతనిపై రాహుల్ గాంధీ కైనా, సీఎం రేవంత్ రెడ్డి కైనా, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కైన స్థానిక నాయకుడు మధు యాష్కీకి ఫిర్యాదు చేసుకోవచ్చని సవాల్ విసిరాడు. దీనిపై మ‌హిళ అని చూడ‌కుండా ఇలాంటి కామెంట్స్ చేసిన స‌ద‌రు రెడ్డి నిర్వాకంపై బీసీ సంఘాలు , నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

  • Related Posts

    నిర్మాణం, నిర్వ‌హ‌ణ లోపం వ‌ల్లే కాళేశ్వ‌రం డ్యామేజ్

    హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు కాళేశ్వ‌రం ప్రాజెక్టు గురించి. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇలాంటి సందర్భాలలో ఏ రాష్ట్రమైనా NDSA ఆదేశాలు, సూచనలను తప్పనిసరిగా పాటించాల‌న్నారు. 2023లో మేడిగడ్డ ఘటన జరిగినప్పుడు, ఎన్డీఎస్ఏ వెంటనే…

    గాన కోకిల‌ ఎస్. జానకి మృతి బాధాక‌రం : జ‌గ‌న్

    అమ‌రావ‌తి : భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్. జానకి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *