హైడ్రాకు రెండేళ్లు హైద‌రాబాద్ లో ర్యాలీలు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో హైడ్రా ఏర్పాటై 2 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్బంగా పెద్ద ఎత్తున ప్ర‌భుత్వ చెరువులు, స్థ‌లాలు, భూముల‌ను భారీ ఎత్తున కాపాడింది. అక్ర‌మార్కుల‌కు చెక్ పెట్టింది. హైడ్రాకు మ‌ద్ద‌తుగా న‌గ‌ర వాసులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేప‌ట్టారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేడుకలే దీనికి నిదర్శనం. తమ ప్రాంతాల్లోని పార్కులు, ప్రజల వినియోగం కోసం ఉద్దేశించిన స్థలాలను కాపాడి, వాటికి కొత్త జీవం పోసిన తీరును అభినందిస్తూ కొన్ని కాలనీల్లో సంబరాలు జరుపుకున్నారు. HYDRA చెరువులను పునరుద్ధరించి, అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించిందని ప్రజలు ఇతర ప్రాంతాల్లో వేడుకలు చేసుకున్నారు. కొండలు, గుట్టలతో కూడిన పచ్చని ప్రభుత్వ భూములను ఆక్రమణల నుండి కాపాడేందుకు తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తూ మరికొందరు సంబరాలు నిర్వహించారు. HYDRA కంచె వేసి రక్షించిన ప్రభుత్వ భూముల వద్ద బాణసంచా కాల్చి, విజయభేరి మోగించారు.

నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు హుస్సేన్ సాగర్ మరియు నెక్లెస్ రోడ్డు వద్దకు చేరుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. NTR గార్డెన్స్ నుండి లుంబినీ పార్క్ వరకు జరిగిన ఈ భారీ ర్యాలీలో ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. HYDRAను ఏర్పాటు చేసి నగరానికి ఉజ్వల భవిష్యత్తును అందించిన ముఖ్యమంత్రి భారీ కటౌట్‌కు వారు క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన HYDRA దేశానికే ఆదర్శమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములు , ప్రజల వినియోగం కోసం ఉద్దేశించిన స్థలాలను కాపాడేందుకు జిల్లాల్లోనూ చర్యలు చేపట్టి, HYDRAను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని చాలామంది డిమాండ్ చేశారు. రెండేళ్లలో 3,315 ఎకరాల భూమిని కాపాడినందుకు HYDRAను వారు అభినందించారు. ఆర్థిక పరంగా చూస్తే ఈ భూముల విలువ కనీసం రూ. 1.50 లక్షల కోట్లు ఉంటుందన్నారు.

  • Related Posts

    నా భ‌ర్త‌ను అక్ర‌మంగా నిర్బంధించారు

    న్యూఢిల్లీ : త‌న భ‌ర్త ప‌ర్యావ‌ర‌ణ వేత్త సోన‌మ్ వాంగ్ చుక్ ను అక్ర‌మంగా నిర్బంధించారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు వాంగ్ చుక్ భార్య‌. ఆదివారం ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించడాన్ని ఆమె ప్రశ్నించారు,…

    శివ చ‌ర‌ణ్ రెడ్డి, ప్ర‌భాక‌ర్ రెడ్డిల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి

    హైద‌రాబాద్ : యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, త‌న తండ్రి ప్ర‌భాక‌ర్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారం పై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు యాద‌గిరిగుట్ట పాల‌క మండ‌లి స‌భ్యురాలు ఈశ్వ‌ర‌మ్మ యాద‌వ్. ఈ మేర‌కు ఆమె టీపీసీసీ చీఫ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *