చెన్నై : తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన డీఎంకే ను లక్ష్యంగా చేసుకున్నారు. గురువారం డీఎంకే హయాంలో చోటు చేసుకున్న అవినీతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. త్వరలోనే అవినీతికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని అవసరమైన సమయంలో బయట పెడతామని ప్రకటించారు. డీఎంకే చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. గత డీఎంకే హయాంలో జరిగిన అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని సరైన సమయంలో వెలుగులోకి తెస్తానని ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ హెచ్చరించారు. తనను రెచ్చ గొట్టవద్దని ఆయన డీఎంకేకు సూచించారు.
అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా, ఆధారాలు లేకుండా డీఎంకే ప్రభుత్వంపై ఆరోపణలు చేయవద్దని టీవీకే (TVK) సభ్యులకు డీఎంకే ఎమ్మెల్యే ఐ. పెరియసామి సూచించారు. దీనికి స్పందిస్తూ విజయ్ లేచి నిలబడి, మూడు శాఖలలో జరిగిన అవినీతిని నిరూపించే ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. అంతకు ముందు మూడు ప్రభుత్వ శాఖలపై జరిపిన ఆడిట్లో డీఎంకే పాలనలో అవినీతి జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయని ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ పేర్కొన్నారు. విల్సన్ వ్యాఖ్యలను ధృవీకరిస్తూ, ముఖ్యమంత్రి తాను సరైన సమయంలో వాస్తవాలను వెల్లడిస్తానని తెలిపారు.





