రూ. 1000 కోట్ల రుణ మోసం కేసులో సుభాష్ చంద్రకు షాక్
ముంబై : రూ. 1,000 కోట్ల రుణ మోసం కేసులో సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు. చేసింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి రుణాలు పొందేందుకు తన నికర ఆస్తి విలువను వాస్తవానికి మించి చూపించారనే ఆరోపణపై మీడియా దిగ్గజం సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ రుణాలు తిరిగి చెల్లించక పోవడంతో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీ హెచ్ ఎఫ్ ఎల్ కు రూ. 1,322 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని శనివారం తెలిపారు. మొత్తం రూ. 980 కోట్ల విలువైన రెండు రుణాల మంజూరు , పంపిణీ కోసం చంద్ర తప్పుడు నికర ఆస్తి విలువ ధృవీకరణ పత్రాలను సమర్పించారని తన ఫిర్యాదులో ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఇప్పుడు ఎఫ్ఐర్లో భాగంగా ఉంది. ఎఫ్ఐర్లో పేర్కొన్న నిందితుల నుండి దీనిపై తక్షణ స్పందన ఏదీ రాలేదు. ఈ ఫిర్యాదు రెండు రుణాలకు సంబంధించినది .
ఒకటి ‘వసంత్ సాగర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్’కు (దీనికి ‘పాన్ ఇండియా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సహ-రుణగ్రహీతగా ఉంది) మంజూరు చేసిన రూ. 500 కోట్ల రుణం కాగా, మరొకటి ‘డిజిటల్ సబ్స్క్రైబర్ మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’కు (దీనికి ‘స్పిరిట్ ఇన్ఫ్రా పవర్ అండ్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సహ-రుణ గ్రహీతగా ఉంది) మంజూరు చేసిన రూ. 480 కోట్ల రుణం. ఫిర్యాదు ప్రకారం, రూ. 500 కోట్ల ‘వసంత్ సాగర్’ రుణం అనేది టేకోవర్, టాప్-అప్ , వ్యాపార విస్తరణ కోసం మంజూరు చేయబడింది . దీనికి చంద్ర సమర్పించిన ‘కంటిన్యూయింగ్ గ్యారెంటీ’ (నిరంతర హామీ) భద్రతగా ఉంది. అలాగే, రూ. 480 కోట్ల ‘డిజిటల్’ రుణం అనేది వేరొక రుణ ఖాతా కింద ‘రెంటల్ సెక్యూరిటైజేషన్ స్కీమ్’ (అద్దె ఆదాయంపై రుణం) ద్వారా మంజూరు చేయబడింది .