హైదరబాద్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మాల మాదిగ సంఘాల జేఏసీ చైర్మైన్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సతీష్ మాదిగ దేవళ్ల. కేసీఆర్ పై ఎస్సి , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ తల్లిని దూషించినందుకు తాము నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద డప్పు చప్పుతో నిరసన తెలిపామని అన్నారు. దళితులమైన తాము ఫామ్ హౌస్ రోడ్లపై నడిచినందుకు కేసీఆర్ ఆ నేలను పసుపు నీళ్లతో శుద్ధి చేయించాడని , ఇది ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు సతీష్ మాదిగ దేవళ్ల.
దళితులంటే కేసీఆర్ కు చిన్నచూపు , ఆయన ప్రోద్భలంతోనే బిఆర్ఎస్ ఎమ్మెల్సీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై ఆ వ్యాఖ్యలు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దళితులను పనిగట్టుకుని అవమానించిన కేసీఆర్ పై ఎస్సి , ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశానని ఈ సందర్బంగా చెప్పారు సతీష్ మాదిగ. ఇదిలా ఉండగా కేసీఆర్ చర్యలకు నిరసనగా ఆయన నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పసుపు నీళ్లతో శుద్ధి చేస్తాం అని ప్రకటించారు. ఇంకోసారి బీఆర్ఎస్ కు చెందిన నేతలు ఎవరైనా తమ జాతికి చెందిన వారిని అవమానిస్తే తాట తీస్తామన్నారు.






