మహారాష్ట్ర : మహారాష్ట్రలో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఒకే ఒక్కడి పేరు వినిపిస్తోంది. అతను ఎవరని అనుకుంటున్నారా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తూ , ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తాడో ఎవరికీ తెలియనంతగా తన పని తాను చేసుకుంటూ పోతున్న , సంచలనం రేపుతున్న తాను ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. అతని పేరు తుకారాం ముండే. ఈ దేశానికి స్వేచ్ఛ లభించి 80 ఏళ్లు అవుతున్న సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, 143 కోట్ల ప్రజలకు కూడా కీలక సూచనలు చేశారు.
దేశం నిరంతరం పురోగమించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ప్రస్తుతం నేను ఆహార భద్రతా కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. మన స్వాతంత్రం మనం తీసుకునే ఆహారానికి కూడా వర్తించాలని నేను చెప్పదలుచుకున్నాను. కేవలం రుచి కోసం కాకుండా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటూ ఆరోగ్యానికి మేలు చేసే సురక్షితమైన ఆహారాన్ని ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఉండాలని కుండ బద్దలు కొట్టారు తుకారం ముండే. మనం ఈ విధానాన్ని పాటిస్తే ఆరోగ్యంగా ఉంటామన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందని, తద్వారా మనం పురోగతి సాధించేందుకు వీలు కలుగుతుందన్నారు. తాజాగా తుకారం ముండే చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.





