
14 శాతం పెరుగుల కనిపించింది
హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధిలో కంటే నేరాలలో టాప్ లో నిలిచింది. తాజాగా వరకట్న వేధింపులు, హత్యలకు సంబంధించి టాప్ లో నిలిచింది. ఇది విస్తు పోయేలా చేసింది. దేశంలోనే నెంబర్ వన్ గా ఉండడం విస్తు పోయేలా చేసింది. వరకట్న సంబంధిత కేసులలో 14 శాతం పెరుగుదల కనిపించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు సంబంధించి 2023లో 15,000 కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. 6,100 వరకట్న సంబంధిత మరణాలు (ఆత్మహత్యలతో సహా) నమోదైవనట్లు నివేదికలో వెల్లడైంది.. తెలంగాణలో 145 వరకట్న మరణాలు నమోదయ్యాయి, అయినప్పటికీ వరకట్న నిషేధ చట్టం, 1961 కింద నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇది నేరాలు , ప్రాసిక్యూషన్ మధ్య స్పష్టమైన అంతరాన్ని వెల్లడిస్తుంది.
ఇక 2023కి సంబంధించిన తాజా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం తెలంగాణ అన్ని దక్షిణాది రాష్ట్రాలలో వరకట్న హత్యల సంఖ్యను అత్యధికంగా నమోదు చేసింది. రాష్ట్రం వరకట్న సంబంధిత హత్యల కేసులను 36 నివేదించింది, పశ్చిమ బెంగాల్ లో 220 కేసులు నమోదు కాగా కేరళలో 224 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 26 కేసులు నమోదు కాగా , కర్ణాటకలో 12, మహారాష్ట్రలో 5 కేసులు నమోదు కాగా తమమిళనాడులో కేవలం ఒకే ఒక్క కేసు నమోదు కావడం విశేషం. 2022లో 44 వరకట్న హత్యల నుండి రాష్ట్రం స్వల్పంగా తగ్గినప్పటికీ, ఈ సంఖ్యలు అన్ని ఇతర దక్షిణాది రాష్ట్రాల కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఇటీవలి కేసులు కొనసాగుతున్న క్రూరత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఆగస్టులో, హనుమకొండలో 21 ఏళ్ల మహిళను కట్నం ఇవ్వడానికి నిరాకరించారనే ఆరోపణలతో ఆమె భర్త గణేష్ గొంతు కోసి చంపాడు. ఇంటికి తాళం వేసి పారిపోయాడు.