త‌క్ష‌ణ‌మే జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేయాలి

Spread the love

స‌ర్కార్ ను డిమాండ్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత

ఆదిలాబాద్ జిల్లా : కాంగ్రెస్ స‌ర్కార్ బ‌క్వాస్ అంటూ మండిప‌డ్డారు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా సెంట్రల్ లైబ్రరీ సందర్శించారు. ఈ సంద‌ర్బంగా నిరుద్యోగులతో మాట్లాడారు. అధికారంలోకి వ‌స్తే 2 లక్ష‌ల జాబ్స్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించార‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం 20 వేల జాబ్స్ కూడా భ‌ర్తీ చేసిన దాఖలాలు లేవ‌న్నారు. జాబ్ క్యాలెండ‌ర్ ఇస్తామ‌న్నార‌ని, అది ఎక్క‌డుందో చెప్పాల‌ని ఆమె నిల‌దీశారు. త‌క్ష‌ణ‌మే జాబ్ క్యాలెండ‌ర్ ను విడుద‌ల చేయాల‌ని క‌విత డిమాండ్ చేశారు. చాలా మంది జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నార‌ని, లైబ్ర‌రీలో వారంతా క‌ష్ట‌ప‌డి చ‌దువుకుంటున్నార‌ని, ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నార‌ని ఈ స‌మ‌యంలో నోటిఫికేష‌న్స్ వేయ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

ఇలా ఎంత కాలం జ‌నాన్ని, నిరుద్యోగుల‌ను మోసం చేస్తారంటూ ప్ర‌శ్నించారు క‌విత‌. అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిప‌డ్డారు. డీఎస్సీ, ఫార్మసీ, గ్రూప్స్ కోసం వారంతా ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తదో అర్థం కాని పరిస్థితి ఉందంటూ వాపోయార‌ని అన్నారు. ఏ అనిశ్చితి ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చారో ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి ఉంద‌న్నారు. జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించేంత దాకా తాము వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌న్నారు క‌విత‌. తాము ఎక్కడికి వెళ్లినా సమస్యలు వెల్ కం చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని సమస్యలకు రాష్ట్రమొక్కటే పరిష్కారం అనుకున్నాం. రాష్ట్రం వచ్చాక కొన్ని సమస్యలు పరిష్కరించు కున్నాం. కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసుకున్నామ‌ని, కానీ ఇంకా ప‌రిష్కారం కాని వేలాది స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని ఆవేద‌న చెందారు క‌విత‌.

  • Related Posts

    బీఎంసీ ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాలి : రాహుల్ గాంధీ

    Spread the love

    Spread the loveప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన ఈసీ ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల (బీఎంసీ) లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం…

    ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

    Spread the love

    Spread the loveసీఎంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీకి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *