ఏపీ సీఐఐ స‌ద‌స్సుకు విశాఖ ముస్తాబు

స‌క్సెస్ చేయాల‌ని ఆదేశించిన చంద్ర‌బాబు

విశాఖ‌ప‌ట్నం : అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఏపీ సీఐఐ స‌మ్మిట్ 2025 కు విశాఖ‌ప‌ట్నం న‌గ‌రం వేదిక కానుంది. ఈనెల 14, 15వ తేదీల‌లో రెండు రోజుల పాటు నిర్వ‌హిస్తోంది రాష్ట్ర కూట‌మి స‌ర్కార్. ఇందులో భాగంగా స‌చివాల‌యంలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌మీక్ష చేప‌ట్టారు. ఎప్ప‌టిక‌ప్పుడు నిర్వాహ‌కుల‌కు సూచ‌న‌లు చేస్తూ మంత్రుల‌కు దిశా నిర్దేశం చేశారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లండ‌న్, అమెరికా, సింగపూర్, దుబాయ్ దేశాల‌లో ప‌ర్య‌టించారు. ఔత్సాహికులు, కంపెనీల ప్ర‌తినిధులు, చైర్మ‌న్లు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లు, సీఈఓలు, క‌న్స‌ల్టెంట్స్, పారిశ్రామిక‌వేత్త‌ల‌ను క‌లిశారు.

ఈ సంద‌ర్బంగా ఏపీలోని విశాఖ వేదిక‌గా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ బోయే ఈ సీఐఐ 2025 స‌ద‌స్సుకు రావాల్సిందిగా ఆహ్వానం ప‌లికారు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. ఈ స‌మ్మిట్ ను ప్ర‌త్యేకంగా ఏపీ స‌ర్కార్ ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. రాష్ట్రానికి చెందిన మొత్తం మంత్రులంతా ఇక్క‌డే కొలువు తీరారు. దీనిని ఎలాగైనా స‌రే స‌క్సెస్ చేయాల‌ని కృత నిశ్చ‌యంతో ప‌ని చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో స‌ర్కార్ ఏకంగా 10 ల‌క్ష‌ల పెట్టుబ‌డులు రాబ‌ట్టాల‌ని భావిస్తోంది. ఈ మేర‌కు ఎంఓయూ (ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న ఒప్పందం) చేసుకోవాల‌ని కృత నిశ్చ‌యంతో ఉంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *