న‌మో అంటే నాయుడు మోదీ : నారా లోకేష్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి భారీ ఎత్తున ఇన్వెస్ట్

అమ‌రావ‌తి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై నమో అంటే నాయుడు అండ్ మోదీ అని అన్నారు. వీరి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ స్పీడులో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ సమ్మిట్ లో మంత్రి లోకేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అడోబ్ చైర్మన్ శంతను నారాయణ్ సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్రానికి రూ. 82,000 కోట్ల ఒప్పందం చేసుకోవ‌డం జ‌రిగింద‌ని ప్ర‌క‌టించారు నారా లోకేష్‌.

రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా విశాఖ వేదిక‌గా 30వ సీఐఐ ఏపీ భాగ‌స్వామ్య స‌ద‌స్సు నిర్వ‌హిస్తోంది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్ర‌పంచంలోని దిగ్గ‌జ కంపెనీల ప్ర‌తినిధులు, చైర్మ‌న్లు, వైస్ చైర్మ‌న్లు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లు, జాయింట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్లు, చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్స్, పెట్టుబ‌డిదారులు, చీఫ్ క‌న్సల్టెంట్స్ , ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతున్నారు. రూ. 10 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు రానున్నాయ‌ని ఆశా భావం వ్య‌క్తం చేశారు మంత్రి నారా లోకేష్.

  • Related Posts

    సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా టాప్

    కర్బన్ ఉద్గారాలను తగ్గించడం అత్యంత క్లిష్టమైన పరిశ్రమల్లో సిమెంట్ రంగం అత్యంత సవాలుతో కూడుకున్నది. ప్రపంచంలో అత్యల్ప కర్బన ఉద్గారాలున్న సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా ఒకటి. 2040 నాటికి కార్బన్ న్యూట్రల్ సంస్థగా మారాలని సంకల్పించింది. పునరుత్పాదక ఇంధనం, ఇంధన…

    బ్యాంకుల ఎస్ఎంఎస్ ఛార్జీలపై ఆర్‌బిఐ ఉక్కుపాదం

    ముంబై : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. SMS అలర్ట్‌లకు కస్టమర్ల నుండి ఛార్జీలు వసూలు చేయడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. నిబంధనల పాటింపు, అవగాహన, లేదా ప్రచార ప్రయోజనాల కోసం ఈ నిర్ణ‌యం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *