రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఆగ‌మాగం : దాసోజు

సీఎంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌న వ‌ల్ల రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని వాపోయారు. గురువారం తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తమ ఫిరాయింపు ఎమ్మెల్యేల వాదనల గురించి నియోజకవర్గ ప్రజలకు తెలుసు కోవాల్సిన అవసరం ఉందన్నారు. స్పీక‌ర్ , సీఎం పూర్తిగా అప్ర‌జాస్వ‌మికంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. ఇందుకు సంబంధించి తాను లేఖ కూడా రాశాన‌ని చెప్పారు దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్. ప్ర‌ధానంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు చేశారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 2 లక్షల 30 వేల కోట్లుగా ప్రతిపాదించారని, సెప్టెంబర్ నాటికి 76 వేల కోట్ల రూపాయలు మాత్రమే రియలైజ్ అయ్యాయని తెలిపారు.

లక్ష్యంలో 33 శాతం మాత్రమే చేరుకున్నారని చెప్పారు దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్. రెవెన్యూ వసూళ్లలో 40 శాతం మాత్రమే సాధించారని అన్నారు. జీఎస్టీ వసూళ్లలో 42 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకున్నారని చెప్పారు. రియల్ ఎస్టేట్‌ను సర్వనాశనం చేశారని మండిప‌డ్డారు సీఎంపై. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా రూ. 19 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా రూ. 7 వేల కోట్లు మాత్రమే వసూలు అయ్యింద‌న్నారు. దీన్ని బ‌ట్టి చూస్తే కేవ‌లం 32 శాతం మేరకే స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఆదాయం వచ్చిందన్నారు. ఎక్సయిజ్ ఆదాయం కూడా 35 శాతం లోపే వచ్చింద‌న్నారు. అప్పులు మాత్రం 83 శాతానికి చేరుకున్నాయని మండిప‌డ్డారు. రెండేళ్లలో రూ. 3.48 లక్షల కోట్ల అప్పు చేశారని ధ్వ‌జ‌మెత్తారు.
ఇవి కాకుండా మరో లక్ష కోట్లు బడ్జెట్‌కు సంబంధం లేని అప్పులు తెచ్చారంటూ ఫైర్ అయ్యారు.
కాగ్ డాటా రేవంత్ బట్టలు విప్పేసింద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *