విద్య‌తోనే వికాసం అభివృద్దికి సోపానం

Spread the love

స్ప‌ష్టం చేసిన నారా భువ‌నేశ్వ‌రి

అమ‌రావ‌తి : జీవితాన్ని ప్ర‌భావితం చేసేది ఒక్క‌టేన‌ని అది విద్య అని గుర్తించాల‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి. చ‌దువుతోనే మ‌నిషిలో సంస్కారం అల‌వ‌డుతుంద‌ని అన్నారు. విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని, అది బ‌తుకు దెరువు చూపించ‌డ‌మే కాకుండా స‌మాజంలో మ‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తీసుకు వ‌చ్చేలా చేస్తుందని అన్నారు నారా భువ‌నేశ్వ‌రి.
ద్రావిడ యూనివర్సిటీలో ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నారా భువనేశ్వరి . అనంతరం ద్రావిడ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానం ఇచ్చారు.

భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలంటే పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. సాధించాల‌న్న ప‌ట్టుద‌ల ఉంటే ఎంత‌టి క‌ష్ట‌మైనా సుల‌భంగా మారి పోతుంద‌న్నారు. కృషి లేకుండా విజ‌యం సాధ్యం కాద‌ని తెలుసుకుంటే మంచిద‌న్నారు. ఇవాళ టెక్నాల‌జీ ఎంతో మారి పోయిందని, దానిని స‌రైన స‌మ‌యంలో గుర్తించి ప‌ట్టు పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తే మీ చెంత‌కే జాబ్స్ వ‌స్తాయని అన్నారు నారా భువ‌నేశ్వ‌రి. త‌న భ‌ర్తకు 75 ఏళ్లు దాటినా నేటికీ ఆయ‌న 18 గంట‌ల‌కు పైగా క‌ష్ట ప‌డ‌తార‌ని , మ‌న కృషినే మ‌న‌ల్ని కాపాడుతుంద‌ని, అదే మ‌న‌కు గుర్తింపును తీసుకు వ‌చ్చేలా చేస్తుంద‌న్నారు. శ్ర‌మనే ఆయుధం, అదే మ‌న‌కు బ‌లం అని, దానిని న‌మ్ముకుని ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు.

  • Related Posts

    బీఎంసీ ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాలి : రాహుల్ గాంధీ

    Spread the love

    Spread the loveప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన ఈసీ ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల (బీఎంసీ) లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం…

    ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

    Spread the love

    Spread the loveసీఎంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీకి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *