సీఎంను క‌లిసిన అన‌లాగ్ ఏఐ సీఈవో

Spread the love

తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఆహ్వానం

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ కంపెనీ అన‌లాగ్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈఓ) అలెక్స్ కిప్ మాన్ హైద‌రాబాద్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా గురువారం సీఎం ఎ. రేవంత్ రెడ్డిని క‌లిశారు. ప్ర‌పంచంలో మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ దార్శ‌నిక సాంకేతిక నిపుణుడిగా త‌ను గుర్తింపు పొందారు. మైక్రోసాఫ్ట్ కినెక్ట్ , హోలోలెన్స్‌లను సృష్టించడంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కిప్‌మాన్ మానవ-కంప్యూటర్ పరస్పర చర్యను పునర్నిర్వచించడంలో మార్గ దర్శకుడిగా గుర్తింపు పొందాడు. తెలంగాణ ఫ్యూచర్ సిటీ, AI సిటీ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులలో తదుపరి తరం ఫిజికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను ఏకీకృతం చేయడానికి సంభావ్య సహకారాల గురించి సీఎం చ‌ర్చించారు అలెక్స్ కిప్ మాన్ తో.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ, పట్టణ వరదలు, వాతావరణ మార్పుల అంచనాను వారి అత్యాధునిక ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పరిష్కరించడంలో అనలాగ్ AI ఆసక్తిని వ్యక్తం చేసింది. ఈసంద‌ర్భంగా సీఎం కీల‌క సూచ‌న చేశారు త‌న‌తో. త‌మ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా వ‌చ్చే డిసెంబ‌ర్ 8,9వ తేదీల‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, కంపెనీల సీఈఓలు, చైర్మ‌న్లు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లు , క‌న్స‌ల్టెంట్స్ హాజ‌ర‌వుతున్నార‌ని, మీరు కూడా రావాల‌ని అలెక్స్ కిప్ మాన్ ను ఆహ్వానించారు.

  • Related Posts

    డిజిట‌ల్ హెల్త్ డేటా పూర్తి చేయాలి : సీఎం

    Spread the love

    Spread the loveమే 31వ తేదీ లోపు డెడ్ లైన్ విధించిన స‌ర్కార్ హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకు వస్తున్న ఎంప్లాయిస్​ హెల్త్ స్కీమ్​…

    రాజస్థాన్ లో ఇసుక తుపాన్ కల్లోలం

    Spread the love

    Spread the loveఇళ్ళలోకి చొచ్చుకొచ్చి నానా బీభత్సం రాజ‌స్థాన్ : ఇసుక తుపాను దెబ్బ‌కు రాజస్థాన్ విల విల లాడింది. రాజ‌స్తాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భానుడి భగభగలతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *