బీజేపీ పాల‌న‌లో వేగంగా వంతెన‌ల నిర్మాణం

Spread the love

వెల్ల‌డించిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : బీజేపీ ఎంపీ ఈటల రాజేంద‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దివంగ‌త ప్ర‌ధాన‌మంత్రి అటల్ బిహారి వాజ్ పేయి హ‌యాంలో దేశంలో ర‌హ‌దారుల రూపు రేఖ‌లు పూర్తిగా మారి పోయాయ‌ని అన్నారు. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో ఎంపీ ప‌ర్య‌టించారు. ఆయ‌న వెంట బీజేపీ సీనియ‌ర్ నేత సుధాక‌ర్ రావు, మాజీ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల రాజుతో క‌లిసి కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని సోమ‌శిల ప్రాంతాన్ని ప‌రిశీలించారు లాంచ్ లో. 2018లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇక్క‌డ పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన సుధాక‌ర్ రావు ప‌ట్టుప‌ట్టి సోమ‌శిల నుంచి నంద్యాల వ‌ర‌కు వంతెన నిర్మాణం కోసం హ‌మీ ఇచ్చార‌ని, ఈ మేర‌కు తాను ప‌ట్టుబ‌ట్టి మంజూరు చేయించు కున్నార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు.

ఇందులో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ సైతం ఓకే చెప్పార‌ని, దీని నిర్మాణం ఖ‌ర్చు దాదాపు రూ. 3,000 కోట్లు దాకా ఉంటుంద‌న్నారు ఈట‌ల రాజేంద‌ర్. ఒక‌వేళ ఈ బ్రిడ్జి ప్రారంభం అయితే తిరుపతి వెళ్ళే వారికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. మ‌రింత వేగంగా వెళ్లేందుకు ఛాన్స్ ఉంటుంద‌న్నారు ఎంపీ. ఈ నిర్మాణం తరువాత టూరిజం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందనుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.
కాగా ఇక్కడ బిజెపి అధికారంలోకి లేకపోయినా, నేతలు ఒప్పించి మెప్పించి ఈ రోడ్లు, బ్రిడ్జిలు మంజూరు చేయించారని ప్ర‌శంస‌లు కురిపించారు సుధాక‌ర్ రావుపై.

  • Related Posts

    బ‌తికి ఉన్నంత వ‌ర‌కు ఎమ్మెల్యేగా పోటీ చేయ‌ను

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన టీపీసీసీ నేత జ‌గ్గారెడ్డి హైద‌రాబాద్ : టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను బ‌తికి ఉన్నంత వ‌ర‌కు సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నంటూ ప్ర‌క‌టించారు. అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేశారు.…

    క్లీన్ ఎనర్జీ దిశ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

    Spread the love

    Spread the loveఇందులో పాలు పంచుకోవ‌డం ఆనందంగా ఉంది అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భవిష్యత్తు కోసం ప్రపంచం పరిశుభ్రమైన, మరింత స్థిరమైన ప్రత్యామ్నాయాలను చురుగ్గా అన్వేషిస్తోందని అన్నారు. గ్రీన్ అమ్మోనియా అటువంటి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *