స‌న్న బియ్యం పంపిణీ ప్ర‌శంస‌నీయం : జోషి

తెలంగాణ స‌ర్కార్ కు కేంద్ర మంత్రి కితాబు

హైద‌రాబాద్ : దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద‌ల‌కు స‌న్న బియ్యం పంపిణీ చేయ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి . ఈ సంద‌ర్బంగా ఆయ‌న సీఎం ఎ. రేవంత్ రెడ్డిని, పౌర స‌ర‌ఫ‌రాలు, నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డిల‌ను అభినందించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామ‌ని కేంద్ర మంత్రికి తెలియ చేశారు సీఎం ఎ . రేవంత్ రెడ్డి. దేశ వ్యాప్తంగా పేద‌ల‌కు ఆయా రాష్ట్రాల‌లో ఇదే ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఈ సంద‌ర్భంగా ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడాల‌ని కోరారు.

ఈ సంద‌ర్బంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కీల‌క‌మైన సూచ‌న‌కు సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషి. మంచి ప‌థ‌క‌మ‌ని, దీని వ‌ల్ల పేద‌ల‌కు ఎంతో మేలు చేకూరుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. త్వ‌ర‌లోనే తాను ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడుతాన‌ని, ఢిల్లీలో ఇందుకు సంబంధించి కీల‌క స‌మావేశం నిర్వ‌హిస్తాన‌ని చెప్పారు. ఇందుకు సంబంధించి సాధ్యా సాధ్యాల‌ను కూడా ప‌రిశీలిస్తామ‌ని పేర్కొన్నారు. మ‌రో వైపు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల‌ను వెంట‌నే మంజూరు చేయాల‌ని కోరారు.

  • Related Posts

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం

    న్యూఢిల్లీ : సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ…

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *