బీజేపీ పాల‌న‌లో వేగంగా వంతెన‌ల నిర్మాణం

వెల్ల‌డించిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : బీజేపీ ఎంపీ ఈటల రాజేంద‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దివంగ‌త ప్ర‌ధాన‌మంత్రి అటల్ బిహారి వాజ్ పేయి హ‌యాంలో దేశంలో ర‌హ‌దారుల రూపు రేఖ‌లు పూర్తిగా మారి పోయాయ‌ని అన్నారు. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో ఎంపీ ప‌ర్య‌టించారు. ఆయ‌న వెంట బీజేపీ సీనియ‌ర్ నేత సుధాక‌ర్ రావు, మాజీ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల రాజుతో క‌లిసి కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని సోమ‌శిల ప్రాంతాన్ని ప‌రిశీలించారు లాంచ్ లో. 2018లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇక్క‌డ పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన సుధాక‌ర్ రావు ప‌ట్టుప‌ట్టి సోమ‌శిల నుంచి నంద్యాల వ‌ర‌కు వంతెన నిర్మాణం కోసం హ‌మీ ఇచ్చార‌ని, ఈ మేర‌కు తాను ప‌ట్టుబ‌ట్టి మంజూరు చేయించు కున్నార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు.

ఇందులో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ సైతం ఓకే చెప్పార‌ని, దీని నిర్మాణం ఖ‌ర్చు దాదాపు రూ. 3,000 కోట్లు దాకా ఉంటుంద‌న్నారు ఈట‌ల రాజేంద‌ర్. ఒక‌వేళ ఈ బ్రిడ్జి ప్రారంభం అయితే తిరుపతి వెళ్ళే వారికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. మ‌రింత వేగంగా వెళ్లేందుకు ఛాన్స్ ఉంటుంద‌న్నారు ఎంపీ. ఈ నిర్మాణం తరువాత టూరిజం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందనుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.
కాగా ఇక్కడ బిజెపి అధికారంలోకి లేకపోయినా, నేతలు ఒప్పించి మెప్పించి ఈ రోడ్లు, బ్రిడ్జిలు మంజూరు చేయించారని ప్ర‌శంస‌లు కురిపించారు సుధాక‌ర్ రావుపై.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *