ఆర్టీసీ బ‌స్సులో నారా భువ‌నేశ్వ‌రి ప్ర‌యాణం

అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచిన సీఎం స‌తీమ‌ణి

చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు భార్య నారా భువ‌నేశ్వ‌రి చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన జ‌ల‌హార‌తి కార్య‌క్రమంలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమ‌మే కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. వ్యవ‌సాయం దండుగ కాదు పండుగ అని పేర్కొన్నారు. సీఎం చంద్ర‌బాబు రాష్ట్ర అభివృద్ది కోసం రేయింబ‌వ‌ళ్లు ప‌ని చేస్తున్నార‌ని, రోజుకు 18 గంట‌ల‌కు పైగా క‌ష్ట ప‌డుతున్నార‌ని తెలిపారు.

ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా మ‌హిళ‌ల‌ కోసం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సతీమణి నారా భువనేశ్వరి వినియోగించుకున్నారు. ఆధార్ కార్డు చూపించి, ఫ్రీ టికెట్ పొంది, శాంతిపురం నివాసం నుంచి తుమ్మిసి వరకూ బస్సులో ప్రయాణించారు. మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలుసుకున్నారు. వారంతా కూట‌మి స‌ర్కార్ కు, ప్ర‌ధానంగా సీఎం చంద్ర‌బాబు నాయుడుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. దీని వ‌ల్ల త‌మ‌కు ఇబ్బందులు త‌ప్పాయ‌న్నారు.

  • Related Posts

    నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంక‌ట్రాం రెడ్డి

    హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన శాస‌న మండ‌లి స‌భ్యుడు (ఎమ్మెల్సీ) వెంక‌ట్రాం రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న కొడుకు భ‌ర‌త్ రాజ్ రెడ్డి గురించి అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఎలాంటి…

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం

    న్యూఢిల్లీ : సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *