రేవంత్ రెడ్డితో మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం భేటీ

ఇద్ద‌రి మ‌ధ్య కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌లు

హైద‌రాబాద్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హైద‌రాబాద్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో కలిసిన సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రేవంత్ రెడ్డి వివరించారు . ప్రధానంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై మోహన్ యాదవ్ కి వివరించారు. అంతే కాకుండా దేశంలో ఎక్క‌డా లేని విధంగా, ఏ రాష్ట్రం అమ‌లు చేయ‌ని విధంగా తాము వ‌చ్చాక స‌న్న బియ్యాన్ని పేద‌ల‌కు పంపిణీ చేస్తున్నామ‌న్నారు.

ఇదే స‌మ‌యంలో తాజాగా రాష్ట్రంలో ప‌ర్య‌టించిన కేంద్ర ఆహార , పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి సైతం తాము అమ‌లు చేస్తున్న స‌న్న బియ్యం ప‌థ‌కాన్ని ప్ర‌శంసించార‌ని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప‌థ‌కాన్ని దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల‌లో అమ‌లు చేయాల‌ని తాము సూచించామ‌ని, ఇందుకు ఆయ‌న స‌మ్మ‌తించార‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే అధికారికంగా ఢిల్లీలో స‌మావేశం కూడా ఏర్పాటు చేస్తామ‌న్నార‌ని చెప్పారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎంతో క‌ల‌వ‌డం మ‌రింత ఆనందంగా ఉంద‌న్నారు రేవంత్ రెడ్డి.

  • Related Posts

    నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంక‌ట్రాం రెడ్డి

    హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన శాస‌న మండ‌లి స‌భ్యుడు (ఎమ్మెల్సీ) వెంక‌ట్రాం రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న కొడుకు భ‌ర‌త్ రాజ్ రెడ్డి గురించి అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఎలాంటి…

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం

    న్యూఢిల్లీ : సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *