ఐటీ రంగంలో ఎదిగేందుకు ఎన్నో అవ‌కాశాలు

స్ప‌ష్టం చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు

హైద‌రాబాద్ : ఐటీ సెక్టార్ లో కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని వాటిని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లాల‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు. మనం మన విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడే ప్రశ్నించే అవకాశాన్ని పొందగలమని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. జేఎన్టీయూహెచ్ లో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఫండింగ్, రీసెర్చ్ క్లస్టర్స్, ఇంటర్నేషనల్ మెంటార్ షిప్ నెట్ వర్క్స్, గ్లోబల్ అల్యూమ్ని కౌన్సిల్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని పూర్వ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.

యువ ఇంజనీర్ల ఆలోచన విధానం మారాలని, ఉద్యోగార్థిగా కాకుండా పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని శ్రీ‌ధ‌ర్ బాబు ఈ సందర్భంగా మార్గ నిర్దేశం చేశారు. కేవలం పుస్తకజ్ఞానమే కాకుండా ప్రాక్టికల్, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ పెంపొందించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.వెంకటేశ్వర రావు, రెక్టార్ డా. కె. విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    నాలెడ్జ్ ఎకాన‌మీలో తెలంగాణ ముందంజ

    హైద‌రాబాద్ : నాలెడ్జ్ ఎకాన‌మీలో హైద‌రాబాద్ లో టాప్ లో ఉంద‌న్నారు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు. సాఫ్ట్‌వేర్‌, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, పరిశోధన, గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లలో హైదరాబాద్‌ ముందుందని చెప్పారు. టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ కాలేజీలు, బిజినెస్‌…

    రూ.2 వేల కోట్ల పెట్టుబడి.. 9వేల మందికి ఉపాధి

    విశాఖపట్నం: ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన ఏఐజీ ఆసుపత్రి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు విశాఖ ఆనందపురం మండలం ఎండాడ వద్ద ఏఐజీ హాస్పిటల్స్ నిర్మాణానికి సంస్థ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డితో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *