ఐటీ రంగంలో ఎదిగేందుకు ఎన్నో అవ‌కాశాలు

Spread the love

స్ప‌ష్టం చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు

హైద‌రాబాద్ : ఐటీ సెక్టార్ లో కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని వాటిని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లాల‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు. మనం మన విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడే ప్రశ్నించే అవకాశాన్ని పొందగలమని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. జేఎన్టీయూహెచ్ లో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఫండింగ్, రీసెర్చ్ క్లస్టర్స్, ఇంటర్నేషనల్ మెంటార్ షిప్ నెట్ వర్క్స్, గ్లోబల్ అల్యూమ్ని కౌన్సిల్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని పూర్వ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.

యువ ఇంజనీర్ల ఆలోచన విధానం మారాలని, ఉద్యోగార్థిగా కాకుండా పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని శ్రీ‌ధ‌ర్ బాబు ఈ సందర్భంగా మార్గ నిర్దేశం చేశారు. కేవలం పుస్తకజ్ఞానమే కాకుండా ప్రాక్టికల్, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ పెంపొందించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.వెంకటేశ్వర రావు, రెక్టార్ డా. కె. విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    రాజ‌ధాని అమ‌రావ‌తి ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక

    Spread the love

    Spread the loveబిల్లుకు ఆమోదం పొంద‌డం సంతోషం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం…

    ఆర్డీటీ సేవ‌ల‌కు ఇక ఆటంకాలు ఉండ‌వు

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ అనంత‌పురం జిల్లా : సామాజిక సేవ‌లో నిమ‌గ్న‌మైన ఆర్డీటీ సంస్థను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. ఆర్.డి.టి. సంస్థ ఎఫ్.సి.ఆర్.ఎ. ను కేంద్ర ప్రభుత్వం రెన్యూవల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *