సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కు భూమి పూజ

తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా : అన్నార్థుల‌, విద్యార్థుల ఆక‌లిని తీర్చుతోంది అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్. గ‌త కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అన్న‌దానం చేస్తోంది. ప్ర‌భుత్వంతో క‌లిసి ఒప్పందం చేసుకుంది. ప‌లు చోట్ల సెంట్ర‌లైజ్డ్ క‌మ్యూనిటీ కిచెన్ ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించారు సీఎం. ఈ సంద‌ర్బంగా నిర్వహించనున్న మిడ్ డే మీల్స్ కిచెన్ ( సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్) భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా జ‌రిగిన స‌మావేశంలో సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. రాబోయే రోజుల్లో కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని రోల్ మోడ‌ల్ గా తీర్చిదిద్దుతాన‌ని ప్ర‌క‌టించారు. రూ. 103 కోట్ల విఇలువ చేసే అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న‌, భూమి పూజ చేయ‌డం మంత్రుల‌తో క‌లిసి ఆనందంగా ఉంద‌న్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ నోయిడాగా కోడంగ‌ల్ ను తీర్చుతాన‌ని చెప్పారు రేవంత్ రెడ్డి. ల‌క్ష‌లాది మందికి ఇది ఆక‌లిని తీర్చ‌డం ఖాయ‌మ‌న్నారు. రైల్వే ప్రాజెక్టు ప‌నులు కూడా ప్రారంభం అవుతాయ‌ని అన్నారు.

  • Related Posts

    ప్ర‌శ్నించ‌డం తోనే ప్ర‌జాస్వామ్యానికి మ‌నుగ‌డ‌

    న్యూఢిల్లీ : ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ భూయాన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌శ్నించ‌డం తోనే ప్ర‌జాస్వామ్యానికి మ‌నుగ‌డ సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా తనను ఆహ్వానించడాన్ని నిరసించినందుకు ఆ యూనివర్సిటీ విద్యార్థుల నమోదును నిషేధించాలన్న బార్…

    దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

    చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ తీపి క‌బురు చెప్పారు. కాళ్లు ప్రభావితమై, చేతులు బాగా పనిచేసే దివ్యాంగులకు ప్రత్యేకంగా రూపొందించిన చక్రాలతో కూడిన తక్కువ ఎత్తు గల స్కూటర్లను పంపిణీ చేస్తామని విజయ్ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *