బీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంది

Spread the love

కార్పొరేట‌ర్ మ‌న్నె క‌వితా రెడ్డి కామెంట్స్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నాయ‌కురాలు, కార్పొరేట‌ర్ మ‌న్నె క‌వితా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రెట్టింపు వేగంతో కారు పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు . స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయనే గ్రామాల్లో ఇందిరమ్మ చీరలు పంచుతున్నారని కాంగ్రెస్ స‌ర్కార్ పై ఆరోపించారు. హైదరాబాద్‌లో ఎన్నికలు లేవు కాబట్టి ఇక్కడ చీరలు పంచడం లేదని మండిప‌డ్డారు. కేటీఆర్ పెట్టిన భయంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక్కో పోలింగ్ బూత్ లో ఒక్కో మంత్రితో రేవంత్ రెడ్డి ప్రచారం చేయించుకున్నాడని ఎద్దేవా చేశారు మ‌న్నె క‌వితా రెడ్డి. ఎన్ని కుట్రలు చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచారో రాష్ట్రమంతా చూశారని అన్నారు.

ఎన్నిక‌ల్లో అడ్డ‌గోలు హామీలు ఇచ్చి ఇప్పుడుచేతులెత్తేసింది మీరు కాదా అని ప్ర‌శ్నించారు మ‌న్నె క‌వితా రెడ్డి. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, క‌ర్ర కాల్చి వాత పెట్ట‌డం ఖాయ‌మ‌న్నారు. ఇప్ప‌టిక‌ప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే వ‌చ్చేది గులాబీ ప్ర‌భుత్వ‌మేన‌ని అన్నారు. ప‌దే ప‌దే కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసు కోవ‌డం త‌ప్పా ఆయ‌న చేసింది ఏమీ లేద‌న్నారు . ప్ర‌జా పాల‌న గాడి త‌ప్పింద‌ని, అవినీతి, అక్రమాల‌కు పాల‌న కేరాఫ్ గా మారింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మ‌న్నె క‌వితా రెడ్డి.

  • Related Posts

    తెలంగాణ అమ‌ర వీరుల‌కు సీఎం నివాళి

    Spread the love

    Spread the loveజూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం హైద‌రాబాద్ : తెలంగాణ ప్రాంతానికి ఆత్మ గౌర‌వం ఎక్కువ అని అన్నారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. జూన్ 2న ఆవిర్బావ దినోత్స‌వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా…

    ఇప్ప‌ట్లో ఉద్యోగాలు ఇవ్వ‌లేం : బుర్రా వెంక‌టేశం

    Spread the love

    Spread the love20 జాబ్స్ కోసం 19,000 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి హైద‌రాబాద్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ చైర్మ‌న్ బుర్రా వెంక‌టేశం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు . తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం ప‌రిస్థితి బాగో లేద‌ని, అందుకే ఎక్కువ‌గా జాబ్స్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *