బీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంది

Spread the love

కార్పొరేట‌ర్ మ‌న్నె క‌వితా రెడ్డి కామెంట్స్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నాయ‌కురాలు, కార్పొరేట‌ర్ మ‌న్నె క‌వితా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రెట్టింపు వేగంతో కారు పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు . స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయనే గ్రామాల్లో ఇందిరమ్మ చీరలు పంచుతున్నారని కాంగ్రెస్ స‌ర్కార్ పై ఆరోపించారు. హైదరాబాద్‌లో ఎన్నికలు లేవు కాబట్టి ఇక్కడ చీరలు పంచడం లేదని మండిప‌డ్డారు. కేటీఆర్ పెట్టిన భయంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక్కో పోలింగ్ బూత్ లో ఒక్కో మంత్రితో రేవంత్ రెడ్డి ప్రచారం చేయించుకున్నాడని ఎద్దేవా చేశారు మ‌న్నె క‌వితా రెడ్డి. ఎన్ని కుట్రలు చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచారో రాష్ట్రమంతా చూశారని అన్నారు.

ఎన్నిక‌ల్లో అడ్డ‌గోలు హామీలు ఇచ్చి ఇప్పుడుచేతులెత్తేసింది మీరు కాదా అని ప్ర‌శ్నించారు మ‌న్నె క‌వితా రెడ్డి. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, క‌ర్ర కాల్చి వాత పెట్ట‌డం ఖాయ‌మ‌న్నారు. ఇప్ప‌టిక‌ప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే వ‌చ్చేది గులాబీ ప్ర‌భుత్వ‌మేన‌ని అన్నారు. ప‌దే ప‌దే కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసు కోవ‌డం త‌ప్పా ఆయ‌న చేసింది ఏమీ లేద‌న్నారు . ప్ర‌జా పాల‌న గాడి త‌ప్పింద‌ని, అవినీతి, అక్రమాల‌కు పాల‌న కేరాఫ్ గా మారింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మ‌న్నె క‌వితా రెడ్డి.

  • Related Posts

    ఏబీఎన్ రాధాకృష్ణా జ‌ర జాగ్ర‌త్త : భ‌ట్టి విక్ర‌మార్క

    Spread the love

    Spread the loveప‌రోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపైనా కూడా కామెంట్స్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై అడుగ‌డుగునా విద్వేషం చిమ్ముతూ లేకి వార్త‌లు రాస్తూ వ‌స్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వాకంపై సీరియ‌స్ అయ్యారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌. తాను సింగ‌రేణి…

    కేసీఆర్, బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి : రేవంత్ రెడ్డి

    Spread the love

    Spread the loveపాలేరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి షాకింగ్ కామెంట్స్ ఖ‌మ్మం జిల్లా : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మ‌రోసారి నోరు పారేసుకున్నారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా మాజీ సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను, క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *