జ‌గ‌న్ దుష్ప్ర‌చారం కొల్లు ర‌వీంద్ర ఆగ్ర‌హం

Spread the love

ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తే ఎలా..?
విజ‌య‌వాడ : మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. నాలుగు గోడ‌ల మ‌ధ్య మాట్లాడితే త‌న‌ను నాయ‌కుడ‌ని ఎలా జ‌నం భావిస్తార‌ని అన్నారు. గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొల్లు ర‌వీంద్ర మాట్లాడారు. జగన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. నెలకి ఒకటి, రెండు సార్లు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో రావడం.. వెళ్లే ముందు ప్రెస్ మీట్ పెట్టి దుష్ప్రచారాలు చేయడం జగన్ రెడ్డికి అనవాయితీగా మారింద‌న్నారు. గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. భ్రష్టు పట్టించాడన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం సంక్షేమం – అభివృద్ధి దిశగా దూసుకు పోతుందన్నారు. ప్రజలందరూ ఆనందంగా ముందుకెళ్తుంటే జగన్ రెడ్డి విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు.

ఏదో ఆయనకు సంబంధించిన నాలుగు ఛానళ్లను పెట్టుకుని హంగామా చేస్తున్నాడని మండిప‌డ్డారు. మీడియా వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తప్పించు కోవ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. మీ పిన్నెళ్లి రామకృష్ణరెడ్డి గురించి.. ఒక నరరూప రక్షసుడి గురించి.. అతనిని దేవతామూర్తి చూపించాలని చూస్తున్నారా..? లేకుంటే జోగి రమేశ్ లాంటి వ్యక్తులను అద్భుతమైన వ్యక్తులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా..? పరకామణి కేసులో వెంకటేశ్వర స్వామి హుండీలో నుంచి డబ్బులు కోట్టేసిన వారిని వెనుకేసుకోచ్చి భక్తుల మనోభావాలను దెబ్బ కొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారా..? ఇవన్నీ కూడా నిజంగా చాలా సిగ్గుచేటు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కొల్లు ర‌వీంద్ర‌.

  • Related Posts

    అమ్మాన్ లో ప్ర‌ధాని మోదీకి ఘ‌న స్వాగ‌తం

    Spread the love

    Spread the loveసంతోషంగా ఉందంటూ పేర్కొన్న పీఎం అమ్మాన్ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న త‌న అధికారిక ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమ్మాన్ లో కాలు మోపారు. అక్క‌డ మోదీకి ఘ‌న స్వాగ‌తం…

    దాడుల‌కు పాల్ప‌డితే ఊరుకోం ఎదుర్కొంటాం

    Spread the love

    Spread the loveకాంగ్రెస్ శ్రేణుల‌కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ హైద‌రాబాద్ : స‌ర్పంచ్, వార్డు మెంబ‌ర్లుగా బీఆర్ఎస్ మ‌ద్ద‌తుదారులు పెద్ద ఎత్తున రెండో విడ‌త జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలుపొందారు. దీంతో త‌ట్టుకోలేని అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయ‌కులు దాడుల‌కు దిగ‌డం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *