అమ్మాన్ లో ప్ర‌ధాని మోదీకి ఘ‌న స్వాగ‌తం

సంతోషంగా ఉందంటూ పేర్కొన్న పీఎం

అమ్మాన్ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న త‌న అధికారిక ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమ్మాన్ లో కాలు మోపారు. అక్క‌డ మోదీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు ప్ర‌వాస భార‌తీయులు. వారి ప్రేమాభిమానులు వెల క‌ట్ట లేనివ‌ని పేర్కొన్నారు న‌రేంద్ర మోదీ. ప్ర‌ముఖ సామాజ‌క మాధ్యమం ఎక్స్ వేదిక‌గా త‌న అనుభ‌వాన్ని పంచుకున్నారు స్వ‌యంగా. ఇలాంటి ప్ర‌దేశాల‌ను తాను సంద‌ర్శించే స‌మ‌యంలో భారతీయులు చూపించే ప్రేమ‌, ఆద‌ర‌ణ త‌న‌కు మ‌రింత‌గా ఉత్తేజాన్ని క‌లిగించేలా చేస్తాయ‌ని తెలిపారు.

అంతే కాదు అమ్మాన్‌లో భారతీయ సమాజం అందించిన హృదయ పూర్వక స్వాగతం నన్ను ఎంతగానో కదిలించిందని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. భారతదేశ పురోగతి పట్ల వారి అభిమానం, గర్వం , బలమైన సాంస్కృతిక బంధాలు భారతదేశం, దాని డయాస్పోరా మధ్య శాశ్వత సంబంధాన్ని ప్రతిబింబిస్తాయ‌ని స్పష్టం చేశారు. భారతదేశం-జోర్డాన్ సంబంధాలను బలోపేతం చేయడంలో డయాస్పోరా నిరంతరం పోషిస్తున్న పాత్రకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *