ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం ముఖ్యం

Spread the love

స్ప‌ష్టం చేసిన వెంక‌య్య నాయుడు

హైద‌రాబాద్ : భారతదేశంలో మధుమేహం క్రమంగా పెరుగుతోందని, దీనికి జన్యుపరమైన కారణాలు ఉన్నా, ప్రస్తుత జీవనశైలే మధుమేహానికి ప్రధాన కారణం అని స్ప‌ష్టం చేశారు దేశ మాజీ రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వర‌పు వెంక‌య్య నాయుడు. ఆదివారం ఆంపుటేషన్ ఫ్రీ తెలంగాణ నినాదంతో ప్రజల్లో మధుమేహం దుష్ఫలితాలపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన వాకథాన్ ని ప్రారంభించారు . “డాక్టర్ వూండ్” అనువర్తనాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంద‌న్నారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువతకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి ద్వారా ఈ సమస్యలను తగ్గించుకోగలం అని స్ప‌ష్టం చేశారు వెంక‌య్య నాయుడు. దానితో పాటుగా, మన శరీరంలోని మార్పులు పట్ల అవగాహన కలిగి ఉండడం ద్వారా మధుమేహం ఉన్నవారు కూడా, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం సాధ్యం అవుతుంద‌న్నారు. ముఖ్యంగా యువత ఉదయాన్నే నిద్ర లేవ‌డం, శారీరక వ్యాయామం చేయడం, ఇష్టమైన ఆట పాటలను ఎంచుకుని సాధన చేయడం ద్వారా ఆరోగ్యకరమైన భారతాన్ని నిర్మించవచ్చు అని పేర్కొన్నారు. ఈ దిశగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాంక్షించారు.

  • Related Posts

    బీజేపీకి స‌రైన వ్య‌క్తి నితిన్ న‌బిన్ : అమిత్ షా

    Spread the love

    Spread the loveత‌న సార‌థ్యంలో పార్టీ మ‌రింత బ‌లోపేతం ఢిల్లీ : బీహార్ కు చెందిన రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ న‌బిన్ కు ఊహించ‌ని రీతిలో ఏకంగా జాతీయ స్థాయి ప‌ద‌వి ద‌క్కింది. ఆయ‌న‌ను భార‌తీయ…

    ఓట్ల చోరీపై పోరాడాలి : సీఎం రేవంత్ రెడ్డి

    Spread the love

    Spread the loveకేంద్ర స‌ర్కార్ పై సంచ‌ల‌న కామెంట్స్ ఢిల్లీ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌ ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఓట్ చోరీకి వ్య‌తిరేకంగా భారీ ఎత్తున…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *