ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం ముఖ్యం

స్ప‌ష్టం చేసిన వెంక‌య్య నాయుడు

హైద‌రాబాద్ : భారతదేశంలో మధుమేహం క్రమంగా పెరుగుతోందని, దీనికి జన్యుపరమైన కారణాలు ఉన్నా, ప్రస్తుత జీవనశైలే మధుమేహానికి ప్రధాన కారణం అని స్ప‌ష్టం చేశారు దేశ మాజీ రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వర‌పు వెంక‌య్య నాయుడు. ఆదివారం ఆంపుటేషన్ ఫ్రీ తెలంగాణ నినాదంతో ప్రజల్లో మధుమేహం దుష్ఫలితాలపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన వాకథాన్ ని ప్రారంభించారు . “డాక్టర్ వూండ్” అనువర్తనాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంద‌న్నారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువతకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి ద్వారా ఈ సమస్యలను తగ్గించుకోగలం అని స్ప‌ష్టం చేశారు వెంక‌య్య నాయుడు. దానితో పాటుగా, మన శరీరంలోని మార్పులు పట్ల అవగాహన కలిగి ఉండడం ద్వారా మధుమేహం ఉన్నవారు కూడా, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం సాధ్యం అవుతుంద‌న్నారు. ముఖ్యంగా యువత ఉదయాన్నే నిద్ర లేవ‌డం, శారీరక వ్యాయామం చేయడం, ఇష్టమైన ఆట పాటలను ఎంచుకుని సాధన చేయడం ద్వారా ఆరోగ్యకరమైన భారతాన్ని నిర్మించవచ్చు అని పేర్కొన్నారు. ఈ దిశగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాంక్షించారు.

  • Related Posts

    రాహుల్‌గాంధీపై విచారణను నిలిపి వేయాలి

    న్యూఢిల్లీ : ఎంపీ, లోక్ స‌భ ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ ద‌క్కింది. సుప్రీంకోర్టు కీల‌క తీర్పు వెల్ల‌డించింది. రాహుల్‌గాంధీపై విచారణను నిలిపి వేయాలని అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నివేదికలు దాఖలు చేయవద్దని…

    భోగాపురం ఎయిర్ పోర్టులో విమానాలు స్టార్ట్

    అమ‌రావ‌తి : ఏపీలోని ఇటీవ‌లే ప్ర‌ధాని మోదీ ప్రారంభించిన భోగాపురం ఎయిర్ పోర్టులో సోమ‌వారం నుచి వాణిజ్య విమానాల రాక పోక‌లు ప్రారంభం అయ్యాయి. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *