కాగ్నిజెంట్ సంస్థలో 25 వేల మందికి జాబ్స్

Spread the love

క‌ల్పిస్తామ‌న్న సీఈఓ ర‌వి కుమార్

విశాఖ‌ప‌ట్నం : కాగ్నిజెంట్ ఐటీ కంపెనీ సీఈఓ ర‌వికుమార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే రోజుల్లో 25 వేల మందికి పైగా జాబ్స్ క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీని వ‌ల్ల ఏపీకి చెందిన ప్ర‌తిభ క‌లిగిన విద్యార్థులు, అభ్య‌ర్తుల‌కు మేలు చేకూరుతుంద‌న్నారు. విశాఖ‌లో కాగ్నిజెంట్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో కాగ్నిజెంట్ సంస్థ సీఈఓ రవికుమార్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. టెక్నాల‌జీ మారుతూనే ఉంటుంద‌ని, దానికి అనుగుణంగా ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ కావాల‌ని సూచించారు. లేక‌పోతే వెనుక‌బ‌డి పోతామ‌న్నారు. ఏఐ వ‌ల్ల కొన్ని ఉద్యోగాలు పోయిన‌ప్ప‌టికీ డేటా సైన్స్ , డేటా అన‌లిటిక్స్, అనాల‌సిస్ కు విప‌రీత‌మైన డిమాండ్ ఉంద‌న్నారు.

కాస్తంత ఫోక‌స్ పెడితే, క‌ష్ట‌ప‌డితే జాబ్స్ త‌ప్ప‌కుండా వ‌స్తాయ‌ని, కాక పోతే కాన్ఫిడెన్స్ క‌లిగి ఉన్న‌ప్పుడే ఇది సాధ్యం అవుతుంద‌న్నారు. కాగ్నిజెంట్ సంస్థ‌కు సంపూర్ణ స‌హ‌కారం అందించినందుకు రాష్ట్ర స‌ర్కార్ కు ప్ర‌త్యేకించి సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇక విశాఖ కాగ్నిజెంట్ సంస్థలో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు సీఈఓ ర‌వికుమార్. కాగా కాగ్నిజెంట్. ముందుగా 8 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తామని ఒప్పందం చేసుకుంది. కానీ స‌ర్కార్ సూచ‌న మేర‌కు అద‌నంగా జాబ్స్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు సీఈఓ.

  • Related Posts

    దేశం గ‌ర్వించ‌దగిన నాయ‌కుడు వాజ్ పాయ్

    Spread the love

    Spread the loveబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధ‌వ్కృష్ణా జిల్లా : ఈ దేశం గ‌ర్వించ ద‌గిన నాయ‌కుడు అటల్ బిహారి వాజ్ పాయ్ అని అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధ‌వ్. మంగ‌ళ‌వారం కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నంలో జ‌రిగిన…

    పారదర్శకంగా కానిస్టేబుళ్ల ఎంపిక

    Spread the love

    Spread the loveమంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌క‌ట‌న‌ అమ‌రావ‌తి : రాష్ట్రంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా పూర్తి పార‌ద‌ర్శకంగా కానిస్టేబుళ్ల రాత ప‌రీక్ష నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ ప్రక్రియలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *