నిజాంపేట‌లో 13 ఎక‌రాలను కాపాడిన హైడ్రా

Spread the love

దీని విలువ సుమారు రూ. 1300 కోట్లు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు ప‌రుగులు పెట్టిస్తోంది. క‌బ్జాదారుల‌కు షాక్ ఇచ్చింది. తాజాగా మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా బాచుప‌ల్లి మండ‌లం నిజాంపేట విలేజ్‌లో 13 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఈ భూమి విలువ దాదాపు రూ. 1300 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా. స‌ర్వే నంబ‌రు 186, 191తో పాటు 334ల‌లో ప్ర‌భుత్వ భూమి క‌బ్జా అవుతోంద‌ని.. కాపాడాల‌ని బాచుప‌ల్లి మండ‌ల రెవెన్యూ అధికారులు హైడ్రాను కోరారు. క‌బ్జాల‌తో ఇప్ప‌టికే కొంత భూమి ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి అయ్యింద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వెంట‌నే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కాపాడాలంటూ హైడ్రాను కోరారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు రెవెన్యూ అధికారుల‌తో క‌లిసి హైడ్రా అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. స‌ర్వే నంబ‌రు 334లో ఇప్ప‌టికే 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి క‌బ్జాలు జ‌రిగి శాశ్వ‌త నివాసాలు కూడా వ‌చ్చిన‌ట్టు నిర్ధారించుకుంది. నివాసాల జోలికి వెళ్ల‌కుండా.. అక్క‌డ మిగిలి ఉన్న 13 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిలో వెలిసిన తాత్కాలిక షెడ్డుల‌ను హైడ్రా తొల‌గించింది. 13 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. అలాగే హైడ్రా బోర్డులు కూడా ఏర్పాటు చేసింది.

  • Related Posts

    ఏపీ స‌ర్కార్ పై జ‌గ‌న్ బుర‌ద చ‌ల్లితే ఎలా..?

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత మంగ‌ళ‌గిరి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. కావాల‌ని ఏపీ స‌ర్కార్ ను బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని…

    జ‌గ‌న్ రెడ్డి కామెంట్స్ కందుల దుర్గేష్ కౌంట‌ర్

    Spread the love

    Spread the loveయోగాంధ్ర కోసం రూ 94 కోట్లు ఖ‌ర్చు చేశాం అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ‌లో నిర్వ‌హించిన యోగాంధ్ర కార్య‌క్రమానికి కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశారంటూ జ‌గ‌న్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *