న‌న్ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారు : క‌విత

Spread the love

అందుకే అన్ని బంధ‌నాల‌ను తెంచుకున్నా

హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ప్ర‌ధానంగా త‌న తండ్రి ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. తెలంగాణ కోసం పోరాటం చేసిన లక్షలాది మంది ఉద్యమకారులకు టీఆర్ఎస్ లో ఇసుమంత కూడా గౌరవం దక్కలేదని వాపోయారు. వేలాదిగా పోస్టులు ఉన్నా సరే వారికి పదవులు ఇవ్వాలని గుర్తుకు రాకపోవటం విచారకరం అన్నారు క‌విత‌. ఉద్యమంలో వేలాది మంది ఆడబిడ్డలు పనిచేస్తే వారికి అవకాశాలే రాలేదని వాపోయారు. ఒకరిద్దరూ నా లాంటి వాళ్లకు మాత్రమే అవకాశం వచ్చిందని చెప్పారు. కానీ నన్ను కూడా చిత్రహింసలు, నానా అవమానాలకు గురి చేసి రాజకీయంగా ఎదగకుండా చేశారని ఆరోపించారు. అలా చేసి ఆ పార్టీ ఏం సాధించిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

తొమ్మిదిన్నరేళ్లలో 14 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి 12 లక్షల కోట్లు ఖర్చు చేశారని మండిప‌డ్డారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఒక్క ఇరిగేషన్ కోసమే లక్షా 89 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారని అన్నారు. కానీ పేద ప్రజలకు మాత్రం ఇళ్లు ఎందుకు ఇవ్వలేక పోయారో చెప్పాలని నిల‌దీశారు .కొంతవరకు మంచి జరిగింది. కానీ ఇది పర్మినెంట్ గా ఉండేలా చేయలేదని అన్నారు. తెలంగాణ వచ్చాక పెద్ద ఎత్తున మంచి జరుగుతుందని ఇంకా ఎంతో చేస్తారని ప్రజలకు ఆశలు ప‌డ్డార‌ని చెప్పారు. కానీ వారి ఆశ‌లు అడియాశ‌లుగా త‌యార‌య్యాయ‌ని పేర్కొన్నారు. ఉద్యమకారులు తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి గౌరవించాలని ఆశిస్తే అది కూడా చేయలేదని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ గత రెండేళ్లుగా మహిళలను, నిరుద్యోగులను, ఉద్యమకారులను మోసం చేస్తోందని ధ్వ‌జ‌మెత్తారు.

  • Related Posts

    బీఎంసీ ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాలి : రాహుల్ గాంధీ

    Spread the love

    Spread the loveప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన ఈసీ ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల (బీఎంసీ) లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం…

    ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

    Spread the love

    Spread the loveసీఎంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీకి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *